ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Krishna Express | కృష్ణా ఎక్స్​ప్రెస్​లో స్లీపర్​ బోగీల పెంపు

    Krishna Express | కృష్ణా ఎక్స్​ప్రెస్​లో స్లీపర్​ బోగీల పెంపు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Krishna Express | కృష్ణా ఎక్స్​ప్రెస్​లో స్లీపర్​ బోగీల సంఖ్య పెరగనుంది. ప్రస్తుతం ఉన్న వివిధ రకాల బోగీల సంఖ్యలను మార్చాలని రైల్వేశాఖ (Railway Department) నిర్ణయించింది. ఇందులో భాగంగా సెకండ్​ క్లాస్​(Second class) చైర్​కార్​ బోగీలను తగ్గించి స్లీపర్​ బోగీలను పెంచనుంది.

    కృష్ణా ఎక్స్​ప్రెస్(17405/17406) ఆదిలాబాద్​– తిరుపతి మధ్య నిత్యం నడుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్​, నిజామాబాద్​ జిల్లాలకు చెందిన చాలా మంది ఈ రైలు ద్వారానే తిరుపతి వెంకన్న దర్శనానికి వెళ్తారు. ఈ ట్రైన్​లో ప్రస్తుతం స్లీపర్​ బోగీలు(Sleeper Coaches) నాలుగు, త్రీటైర్ ఏసీ నాలుగు, సెకండ్ క్లాస్ చైర్ కార్ 10, జనరల్ సెకండ్ క్లాస్ నాలుగు బోగీలున్నాయి. ఈ నెల 6 నుంచి త్రీటైర్​ ఏసీ బోగీల్లో ఒకటి, సెకండ్​ క్లాస్​ చైర్​కార్​ బోగీల్లో నాలుగు తగ్గించనున్నారు.

    దీంతో త్రీటైర్ ఏసీ మూడు, సెకండ్ క్లాస్ చైర్​కార్ ఆరు బోగీలు అందుబాటులో ఉంటాయి. స్లీపర్​ బోగీల సంఖ్య నాలుగు నుంచి ఎనిమిదికి పెరగనుంది. సెప్టెంబరు 1 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది. సెప్టెంబరు 2 నుంచి జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు నాలుగుకు తగ్గి స్లీపర్ బోగీల సంఖ్య 14కు పెరగనుంది. ఆదిలాబాద్-హెచ్ఎస్ నాందేడ్ మధ్య నడి చే రైల్లో కూడా మార్పులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

    Krishna Express | 1974లో ప్రారంభం

    కృష్ణా ఎక్స్​ప్రెస్ (Krishna Express train)​ 1974లో ప్రారంభమైంది. అప్పటి నుంచి నిరంతరాయంగా సేవలు అందిస్తునే ఉంది. కాలనుగుణంగా మార్పులు చెందుతూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తోంది. మొదట ఇది సికింద్రాబాద్​ నుంచి విజయవాడ(Secunderabad to Vijayawada) వరకు నడిచింది. తెలంగాణ–ఆంధ్ర మధ్య కృష్ణా నది వారధిగా ఉండడంతో దీనిని కృష్ణా ఎక్స్​ప్రెస్​ అని పేరు పెట్టారు.

    అనంతరం ఈ రైలును విజయవాడ నుంచి గుంటూరు వరకు పొడిగించారు. తర్వాత స్టేషన్లను పొడిగిస్తూ ప్రస్తుతం తిరుపతి వరకు నడుపుతున్నారు. మరోవైపు తెలంగాణలో సైతం సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్ (Secunderabad to Nizamabad) మీదుగా ఆదిలాబాద్ వరకు ఈ రైలును పొడిగించారు.

    More like this

    September 12 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 12 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగంతేదీ (DATE) – సెప్టెంబరు 12,​ 2025 పంచాంగంశ్రీ విశ్వావసు...

    festivals Special trains | పండుగల వేళ ప్రత్యేక రైళ్లు.. అందుబాటులోకి మరో కొత్త రాజధాని ఎక్స్‌ప్రెస్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: festivals Special trains : దసరా Dussehra, దీపావళి Diwali పండుగల సందర్భంగా భారతీయ రైల్వే...

    RBI land transaction | వామ్మో.. ఎకరం ధర ఏకంగా రూ.800 కోట్లు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RBI land transaction | రిజర్వు బ్యాంకు(ఆర్​బీఐ)ను భారత్​ కేంద్ర బ్యాంకుగా పేర్కొంటారు. భారతీయ రిజర్వ్...