అక్షరటుడే, కోటగిరి: Pothangal | పోతంగల్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండలాధ్యక్షుడు కల్లూరి హన్మాండ్లు (బజరంగ్) మాట్లాడుతూ.. ఓ వర్గం వ్యక్తులు ఆపరేషన్ సిందూర్పై (Operation Sindoor) అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. ఈ మేరకు బీజేపీ అధిష్టానం పిలుపు మేరకు మండల కేంద్రంలో ఆదివారం ధర్నా నిర్వహించినట్లు పేర్కొన్నారు.
Pothangal | సీఎం రేవంత్రెడ్డి క్షమాపణ చెప్పాలి
140 కోట్ల జనాభా ఉన్న భారతదేశాన్ని సైనం నిద్రహారాలు మాని.. ప్రాణాలకు తెగించి కాపాడుతుంటే దేశంలోనే ఓ వర్గం వ్యక్తులు వారి సేవలను తక్కువ చేసి మాట్లాడడం సరికాదని వారు స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth reddy) వెంటనే త్రివిధ దళాలకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఓమన్నపటేల్, విజయ్, సాయి కృష్ణ, శంకర్, దిగంబర్ పటేల్, రమేష్, కుమ్మరి లక్ష్మణ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
