అక్షరటుడే, వెబ్డెస్క్ : Paddy Bonus | ఆంధ్ర ప్రదేశ్ AP నుంచి కొందరు దళారులు తెలంగాణ Telanganaకు అక్రమంగా ధాన్యం paddy తీసుకు వస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ congress అధికారంలోకి వచ్చాక సన్నవడ్లకు బోనస్ ప్రకటించిన విషయం తెలిసిందే. క్వింటాలుకు రూ.500 బోనస్ అందజేస్తోంది. దీంతో ఆంధ్ర దళారులు అక్కడ రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని తెలంగాణ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించడానికి తీసుకు వస్తున్నారు. ఇక్కడ ధాన్యం అమ్మి బోనస్ డబ్బులు కాజేయాలని చూస్తున్నారు.
Paddy Bonus | ఏడు లారీల పట్టివేత
ఏపీ నుంచి తెలంగాణకు అక్రమంగా ధాన్యం తీసుకు వస్తున్న ఏడు లారీలను శనివారం అధికారులు పట్టుకున్నారు. నల్గొండ nalgonda జిల్లా వాడపల్లి బార్డర్ చెక్ పోస్ట్ వద్ద లారీలను సీజ్ చేశారు. పలువురిపై కేసులు నమోదు చేసిన పోలీసులు, ధాన్యం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Paddy Bonus | సరిహద్దుల్లో చెక్పోస్టులు
బోనస్ డబ్బుల కోసం ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా ధాన్యం వచ్చే అవకాశం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే చెక్పోస్టులను ఏర్పాటు చేసింది. ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వడ్ల లారీలు రాకుండా సరిహద్దుల్లో అధికారులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అయినా పలువురు దళారులు అడ్డదారుల్లో ధాన్యం తీసుకువస్తున్నట్లు సమాచారం.
Paddy Bonus | వారు సహకరిస్తేనే..
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయిస్తే రైతు పట్టాపాస్బుక్, బ్యాంకు ఖాతా జిరాక్స్ తీసుకుంటారు. ఎకరాకు ఇన్ని బస్తాలు మాత్రమే కాంటా చేస్తారు. అయితే ఆంధ్ర నుంచి లారీలు తీసుకొచ్చిన దళారులకు రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సహకరిస్తేనే బోనస్ డబ్బులు వస్తాయి. ఆ ధాన్యాన్ని ఇక్కడి రైతుల పేరుమీద విక్రయించినట్లు ట్రక్షీట్ రాస్తేనే డబ్బులు జమ అవుతాయి. దళారులు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో కుమ్మక్కై ధాన్యం తీసుకు వస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.