అక్షరటుడే, ఇందూరు : Temple Lands | నిజామాబాద్ జిల్లాలో దేవాలయ భూములకు అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని రాష్ట్రీయ వానరసేన డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం ప్రజావాణి(Prajawani)లో అసోసియేషన్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా రాష్ట్రీయ వానరసేన జిల్లా కన్వీనర్ గెంట్యాల వెంకటేష్ మాట్లాడుతూ.. నందిపేట్(Nandipet) మండలంలోని తల్వేద గ్రామంలో కాకయ్య మందిరానికి దానం చేసిన దేవాలయ భూమిని, ప్రభుత్వ సీలింగ్ భూములను అక్కడి మాజీ సర్పంచ్(Former Sarpanch) అక్రమంగా తన కుమారులపై రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు.
ఈ భూముల్లో మాజీ సర్పంచ్ రైస్మిల్ నిర్మించి స్థానికులకు ఇబ్బందులు కలిగిస్తున్నాని ఆరోపించారు. ఇప్పటికే ఆర్మూర్ ఆర్డీఓ విచారణ(Armoor RDO Investigation) చేసి నోటీసులు జారీ చేశారని పేర్కొన్నారు. అయినప్పటికీ భూమిని నలుగురు కుమారుల పేర్లపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినందున, ఆ రిజిస్ట్రేషన్లను రద్దు చేసి, సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.