HomeతెలంగాణBodhan| అక్రమ వలసదారులను పంపించేయాలి

Bodhan| అక్రమ వలసదారులను పంపించేయాలి

- Advertisement -

అక్షరటుడే, బోధన్‌: Bodhan| అక్రమ వలసదారులను పంపించేయాలి| దేశంలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులను గుర్తించి దేశం నుంచి పంపివేయాలని బీజేపీ(BJP) నాయకులు డిమాండ్‌ చేశారు. మంగళవారం పట్టణ అధ్యక్షుడు గోపికిషన్‌ ఆధ్వర్యంలో సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయికి (Sub-Collector Kiranmayi) వినతిపత్రం అందజేసి మాట్లాడారు. పహల్గావ్‌ ఉగ్రదాడి (Pahalgaon terror attack) నేపథ్యంలో దేశంలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్థాన్​(Pakistan), బంగ్లాదేశీయులను (Bangladesh) వెంటనే తరిమేయాలన్నారు. కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తూ అలాంటి వారిని గుర్తించి చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సుధాకర్‌ చారి, నాయకులు బాలరాజు, వినోద్, సందీప్, గౌతం, వాసు, తదితరులు పాల్గొన్నారు.