Nizamabad city | సర్వే నంబర్​ 249లో అక్రమ నిర్మాణాల నిలిపివేత.. ‘అక్షరటుడే’ కథనానికి స్పందన

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Nizamabad city | నిజామాబాద్​ శివారులోని అర్సపల్లిలో గల ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు మళ్లీ మొదలైన విషయం తెలిసిందే. సర్వే నంబర్​ 249లో కొందరు అక్రమార్కులు ఓ మాజీ కార్పొరేటర్​ సాయంతో ఇళ్ల నిర్మాణాలను చేపడుతున్నారు. దీనిపై ‘అక్షరటుడే’లో ‘సర్వే నంబర్​ 249లో మళ్లీ అక్రమ నిర్మాణాలు..’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన రెవెన్యూ అధికారులు సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్రమంగా చేపడుతున్న నిర్మాణ పనులను నిలిపివేయించారు. Nizamabad city | […]

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Nizamabad city | నిజామాబాద్​ శివారులోని అర్సపల్లిలో గల ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు మళ్లీ మొదలైన విషయం తెలిసిందే. సర్వే నంబర్​ 249లో కొందరు అక్రమార్కులు ఓ మాజీ కార్పొరేటర్​ సాయంతో ఇళ్ల నిర్మాణాలను చేపడుతున్నారు. దీనిపై ‘అక్షరటుడే’లో ‘సర్వే నంబర్​ 249లో మళ్లీ అక్రమ నిర్మాణాలు..’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన రెవెన్యూ అధికారులు సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్రమంగా చేపడుతున్న నిర్మాణ పనులను నిలిపివేయించారు.

Nizamabad city | నిజామాబాద్‌ నార్త్‌ మండలంలో..

నిజామాబాద్‌ నార్త్‌ మండలంలోని సర్వే నంబర్‌ 249లో మొత్తం 1,581 గజాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి గతంలో కొందరు ఇళ్ల నిర్మాణం చేపట్టారు. దీంతో అప్పట్లో ఆరో టౌన్‌ పోలీసులు 13 మందిపై కేసు నమోదు చేశారు. క్షేత్రస్థాయిలో సర్వే జరిపి ఇళ్లు నిర్మించిన వారికి నోటీసులు ఇచ్చారు. అయితే ఈ మొత్తం వ్యవహారం వెనుక అధికార పార్టీలో ఉన్న ఓ మాజీ కార్పొరేటర్​ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. అతని అందండలతోనే తాజాగా కొందరు డబుల్​ బెడ్​రూం ఇళ్లను నిర్మిస్తున్నట్లు సమాచారం. సదరు మాజీ కార్పొరేటర్​ నకిలీ దస్త్రాలను సృష్టించి 249 ​సర్వే నంబర్​లోని ప్రభుత్వ భూమిని పేదలకు విక్రయించాడు. వాటి ఆధారంగానే పలువురు నిర్మాణాలు పూర్తి చేశారు.

Nizamabad city | మాజీ కార్పొరేటర్​ అండదండలు..

కొద్దిరోజులుగా అధికారులెవరూ అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో తిరిగి అక్రమ నిర్మాణాలు మొదలు పెట్టారు. మరో వైపు మాజీ కార్పొరేటర్​ అండదండలు అందించడమే కాకుండా.. డబుల్​ బెడ్​రూం ఇళ్ల కింద ఆర్థిక సహాయం అందించేలా చూస్తానని వారికి హామీ ఇవ్వడం కొసమెరుపు. వాస్తవానికి ప్రభుత్వ భూమిలో నిర్మించే ఇళ్లకు రెండు పడక గదుల ఇళ్ల స్కీం వర్తించదు. అయినప్పటికీ సదరు మాజీ ప్రజాప్రతినిధి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారికి అండదండలు అందించడం గమనార్హం.

కాగా.. మళ్లీ నిర్మాణాలు ప్రారంభించడంతో ‘అక్షరటుడే’ కథనాన్ని ప్రచురించింది. దీంతో రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లారు. వెంటనే అక్రమ నిర్మాణాలను నిలిపివేయించారు.

Balla Sandeep Kumar
Balla Sandeep Kumar
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2006 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

Kishtwar Encounter Operation | జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kishtwar Encounter Operation | జమ్మూ కశ్మీర్​లో ఆదివారం ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారు....

Kamareddy College Land Dispute | ముదురుతున్న కళాశాల ఆస్తుల వివాదం.. ఎమ్మెల్యే రాజీనామాస్త్రం

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల (Govt Degree College) ఆస్తుల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత పదేళ్లుగా ఈ అంశం రాజకీయ ఆరోపణలకు అస్త్రంగా మారుతూనే ఉంది.

Vemula Prashanth Reddy Protest | రైతుల కోసం పోరాడితే అక్రమ కేసులా : మాజీ మంత్రి వేముల

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్​రెడ్డి అన్నారు.

Revanth Reddy Projects Completion | రెండేళ్లలో పెండింగ్​ ప్రాజెక్ట్​లు పూర్తి చేస్తాం : సీఎం రేవంత్​రెడ్డి

రాష్ట్రంలో పెండింగ్​ ప్రాజెక్ట్​లను రెండేళ్లలో పూర్తి చేస్తామని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడెంలో దేవాదుల ప్రాజెక్ట్​ను ఆదివారం ఆయన సందర్శించారు.