Bheemgal | కారుణ్య నియామకాలతోనే ఐకేపీ సిబ్బందికి భరోసా

అక్షరటుడే, భీమ్‌ గల్‌: Bheemgal | విధి నిర్వహణలో అకాల మరణం చెందిన సెర్ప్‌–ఐకేపీ సిబ్బంది (SERP-IKP staff) కుటుంబీకులకు కారుణ్య నియామకాలతోనే భరోసా లభిస్తుందని టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు, జిల్లా ఎంప్లాయీస్‌ జేఏసీ చైర్మన్‌ నాశెట్టి సుమన్‌ అన్నారు. కమ్మర్‌పల్లికి (Kammarpally) చెందిన ఐకేపీ సీసీ రాజేశ్వర్‌ ఇటీవల మృతి చెందగా.. బుధవారం వారి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం జిల్లా ఐకేపీ సిబ్బంది ద్వారా విరాళాల రూపంలో పోగు చేసిన రూ.75వేలను టీఎన్జీవో కార్యదర్శి శేఖర్, […]

అక్షరటుడే, భీమ్‌ గల్‌: Bheemgal | విధి నిర్వహణలో అకాల మరణం చెందిన సెర్ప్‌–ఐకేపీ సిబ్బంది (SERP-IKP staff) కుటుంబీకులకు కారుణ్య నియామకాలతోనే భరోసా లభిస్తుందని టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు, జిల్లా ఎంప్లాయీస్‌ జేఏసీ చైర్మన్‌ నాశెట్టి సుమన్‌ అన్నారు. కమ్మర్‌పల్లికి (Kammarpally) చెందిన ఐకేపీ సీసీ రాజేశ్వర్‌ ఇటీవల మృతి చెందగా.. బుధవారం వారి కుటుంబాన్ని పరామర్శించారు.

అనంతరం జిల్లా ఐకేపీ సిబ్బంది ద్వారా విరాళాల రూపంలో పోగు చేసిన రూ.75వేలను టీఎన్జీవో కార్యదర్శి శేఖర్, ఐకేపీ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కుంట గంగాధర్, జిల్లా జేఏసీ ఛైర్మన్‌ బత్తుల మాణిక్యం, రవి విఠల్‌తో కలిసి మృతుడి భార్యకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం (state government) ఉద్యోగుల సంక్షేమం కోసం సానుకూలంగా వ్యవహరిస్తుందని, ఐకేపీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కారుణ్య నియామకాల కోసం ఇచ్చిన వినతిపై ఫైల్‌ ఆర్థిక శాఖకు చేరిందన్నారు.

Related articles

ASHA Workers Arrest | సీఐటీయూ, ఆశకార్యకర్తల ముందస్తు అరెస్ట్​

బాన్సువాడ పట్టణంలో సీఐటీయూ నాయకులను, ఆశకార్యకర్తలను పోలీసులు అరెస్ట్​ చేశారు. అనంతరం పోలీస్​స్టేషన్​కు తరలించారు.

Soumya Government Job | ఎక్సైజ్ కానిస్టేబుల్​ గాజుల సౌమ్య సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం

విధినిర్వహణలో గంజాయి ముఠాను పట్టుకునే క్రమంలో ఎక్సైజ్​ కానిస్టేబుల్​ గాజుల సౌమ్య మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం ఆమె​ సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది.

Hyderabad CP Marriage Warning | పెళ్లికి ముందు దగ్గరవ్వొద్దు.. అమ్మాయిలకు సీపీ హెచ్చరిక

పెళ్లి పేరుతో జరిగే మోసాలపై యువతులు అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్​ సూచించారు. డబ్బులు డిమాండ్​ చేస్తే ఫిర్యాదు చేయాలన్నారు.

TTD Laddu Case Verdict | టీటీడీ లడ్డూ కేసులో ప్రభుత్వానికి ఊరట..

టీటీడీ లడ్డూ కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏకసభ్య కమిటీ విచారణ కొనసాగించవచ్చని ధర్మాసనం పేర్కొంది.