అక్షరటుడే, ఇందూరు: Hyper Tension Day | హైపర్టెన్షన్ను నిర్లక్ష్యం చేస్తే అనారోగ్య సమస్యలు పెరుగుతాయని మెడికవర్ ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుట్ట చౌరస్తాలో మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. రన్ను చిన్నపిల్లల వైద్యుడు సురేష్ జాజు జెండా ఊపి ప్రారంభించారు. 2కే రన్ ఎల్లమ్మగుట్ట చౌరస్తా నుంచి ప్రారంభమై కోర్టు చౌరస్తా మీదుగా సాగింది.
ఈ సందర్భంగా కార్డియాలజిస్ట్ సందీప్రావు మాట్లాడుతూ.. హైపర్ టెన్షన్పై అవగాహన కోసం 2కే రన్ నిర్వహించడం శుభపరిణామమన్నారు. ప్రపంచవ్యాప్తంగా మే 17న హైపర్ టెన్షన్ డే(బీపీ దినోత్సవం) నిర్వహిస్తారన్నారు. సమయాలనుకూలంగా భోజనం చేయడం, వ్యాయామం, యోగా, ధ్యానం చేయడం ద్వారా బీపీని అదుపులో ఉంచుకోవచ్చన్నారు. ఈ అవగాహన ర్యాలీలో ఓపెన్ హార్ట్ సర్జన్ డాక్టర్ అవిన్ సనార్, న్యూరో సర్జన్ శ్రీకృష్ణ ఆదిత్య, నెఫ్రాలజిస్ట్ అజయ్ కుమార్, విశ్వనాథ్ పాటిల్, జనరల్ సర్జన్ మనోజ్, యజ్ఞ, సెంటర్ హెడ్ స్వామి, మార్కెటింగ్ హెడ్ వినయ్ కుమార్, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.