ePaper
More
    HomeతెలంగాణBRS | రాష్ట్రాన్ని రేవంత్​రెడ్డి నాశనం చేస్తున్నారు: ప్రశాంత్ రెడ్డి

    BRS | రాష్ట్రాన్ని రేవంత్​రెడ్డి నాశనం చేస్తున్నారు: ప్రశాంత్ రెడ్డి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:BRS | కష్టపడి సాధించుకున్న తెలంగాణ(Telangana)ను కేసీఆర్​ పదేళ్లలో ఎంతో అభివృద్ధి చేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్​రెడ్డి (MLA Vemula Prashanth Reddy), మాజీ ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్​రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్(Bajireddy Govardhan)​ అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం నిజామాబాద్​ నగరంలోని అమరవీరుల స్థూపం వద్ద వారు నివాళులు అర్పించారు.

    ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 14 ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేసి కేసీఆర్(KCR) తెలంగాణ సాధించారన్నారు. ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజా సంఘాలు, మహిళలు, సబ్బండ వర్ణాలు అన్ని ఒక్క దిక్కు నిలిచి తెలంగాణ కోసం నాడు కేసీఆర్ వెంట నడిచాయని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సాధించుకొని 11 ఏళ్లు అవుతోందన్నారు.

    తెలంగాణలో కేసీఆర్ అన్నివర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని జనరంజక పాలన అందించారని చెప్పారు. ఆయన రాష్ట్రాన్ని అనేక రంగాల్లో అగ్రస్థానంలో నిలిపారన్నారు. రేవంత్​రెడ్డి(cm Revanth Reddy) పాలనలో రాష్ట్రం తిరోగమనంలో ఉందని విమర్శించారు. కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నరలోనే రాష్ట్ర తలసరి ఆదాయంలో 4వ స్థానానికి ,GSDPలో 13వ స్థానానికి పడిపోయిందన్నారు. రాష్ట్ర​ ప్రభుత్వం (Congress government) ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్​ చేశారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...