అక్షరటుడే, ఇందూరు: Chintakayala Rajender | తనను గెలిపిస్తే ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటూ అభివృద్ధికి కృషి చేస్తానని 25 డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి చింతకాయల రాజేందర్ (Chintakayala Rajender)(రెయిన్బో రాజన్న) అన్నారు. ఈ మేరకు గురువారం ఆయా కాలనీల్లో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.
Chintakayala Rajender | ఎంపీ, ఎమ్మెల్యే సహకారంతో..
నగరంలో ఎంపీ అర్వింద్ (MP Arvind), ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ (MLA Dhanpal Suryanarayana) ఆధ్వర్యంలో నగరం అభివృద్ధి చెందుతోందన్నారు. ఈ క్రమంలోనే డివిజన్లో వారి మద్దతుతో అభివృద్ధి చేసే అవకాశం తనకు ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా కాలనీల్లో ప్రతిఒక్కరినీ పలకరిస్తూ ముందుకు వెళ్లారు. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
డివిజన్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నా..
కార్పొరేటర్గా తనను గెలిపిస్తే డివిజన్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని రాజేందర్ ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రతి ఒక్క సమస్యను తన సమస్యగా భావిస్తూ పరిష్కరించే దిశగా కృషి చేస్తానని తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.