అక్షరటుడే, ఇందూరు: Matam Pawan | తనను కార్పొరేటర్గా గెలిపిస్తే ఎల్లవేళలా ప్రజల మధ్యే ఉంటూ 8వ డివిజన్ను అభివృద్ధి చేస్తానని బీజేపీ అభ్యర్థి మఠం పవన్ (Matam Pawan) అన్నారు. ఈ మేరకు గురువారం కాలనీల్లో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.
8వ డివిజన్లో మౌలిక వసతుల కొరత తీవ్రంగా వేధిస్తోందని మఠం పవన్ అన్నారు. ఈ సందర్భంగా తనను గెలిస్తే ముందుగా కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. డివిజన్ అభివృద్ధికి శాయాశక్తులా ప్రయత్నిస్తానన్నారు.
అధినాయకుల సహకారంతో..
ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే ధన్పాల్ (MP Arvind and MLA Dhanpal) సహకారంతో డివిజన్కు అధిక నిధులు తీసుకొస్తామని అభ్యర్థి మఠం పవన్ అన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని.. ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించి పరిష్కారం అయ్యేవరకు పోరాడతామని ఆయన పేర్కొన్నారు. ఈ కారక్రమంలో బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
