అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Shivalingari Umarani | నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో (Nizamabad Municipal Corporation elections) తనని మళ్లీ గెలిపిస్తే 6వ డివిజన్ను మరింత అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ అభ్యర్థిని (BRS candidate) శివలింగారి ఉమారాణి అన్నారు. ఈ మేరకు మంగళవారం డివిజన్లో ప్రచారం నిర్వహించారు.
Shivalingari Umarani | ఎప్పటికీ ప్రజల మనిషినే..
ఈ సందర్భంగా అభ్యర్థిని శివలింగారి ఉమారాణి డివిజన్లోని వినాయక్నగర్, తదితర కాలనీల్లో కలియదిరిగారు. తాను ఎప్పటికీ ప్రజల మనిషినేనన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామన్నారు. డివిజన్కు ఇంకా ఎంతో చేయాల్సి ఉందన్నారు.
సమస్కల పరిష్కారానికి కృషి..
నగరం రోజురోజుకూ విస్తరిస్తోందన్నారు. ఈ క్రమంలో డివిజన్లో శివారు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు మౌలిక సదుపాయాలు అందించాల్సి ఉందన్నారు. తనను గెలిపిస్తే అన్ని కాలనీల్లోనూ అభివృద్ధికి శాయాశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 6వ డివిజన్ ప్రజలు తనను మళ్లీ ఆదరించి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.