- Advertisement -
Homeతాజావార్తలుBC Reservations | బీసీ రిజర్వేషన్లు అమలు చేయకపోతే.. తీవ్ర పరిణామాలు : ఎమ్మెల్సీ మధుసూదనాచారి

BC Reservations | బీసీ రిజర్వేషన్లు అమలు చేయకపోతే.. తీవ్ర పరిణామాలు : ఎమ్మెల్సీ మధుసూదనాచారి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : BC Reservations | రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ఎమ్మెల్సీ మధుసూదనాచారి(MLC Madhusudhanachari) హెచ్చరించారు.

రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల(BC Reservations)పై ఎటు తేలడం లేదు. దీంతో కాంగ్రెస్​ ప్రభుత్వ తీరుపై బీఆర్​ఎస్​ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బుధవారం మధుసూదనాచారి మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని ఓ వైపు సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) చెబుతున్నారన్నారు. మరోవైపు ఆయనే కోర్టులో కేసులు వేయిస్తున్నారని ఆరోపించారు.‘‘అన్యాయం జరిగితే భరించొచ్చు.. అవమానం జరిగితే సహించం.. మనసు గాయపడితే పర్యావసనాలు తీవ్రంగా ఉంటాయి’ అని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

ఎన్నికల సమయంలో ఇచ్చినట్లు 42శాతం బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలన్నారు. లేకపోతే ఆందోళనలు చేపడుతామని ఆయన హెచ్చరించారు. ఇది కాంగ్రెస్​ పార్టీ(Congress Party) తానంతట తాను ఇచ్చిన హామీ అని.. బీసీలు చేసిన డిమాండ్​ కాదన్నారు. బీసీలకు 75 ఏళ్లుగా దేశంలో అన్యాయం జరిగిందన్నారు. జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తుంటే కాంగ్రెస్​ 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చిందన్నారు. ఆ హామీని అమలు చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News