Homeతాజావార్తలుIAS transfer | తెలంగాణలో పలువురు ఐఏఎస్​ల బదిలీ

IAS transfer | తెలంగాణలో పలువురు ఐఏఎస్​ల బదిలీ

తెలంగాణలో పలువురు ఐఏఎస్​లు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: IAS transfer | తెలంగాణలో నలుగురు ఐఏఎస్​లు బదిలీ అయ్యారు. వారిని ట్రాన్స్​ఫర్​ చేస్తూ చీఫ్​ సెక్రెటరీ రామకృష్ణా రావు (Chief Secretary Ramakrishna Rao) బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఐఏఎస్​ ఆఫీసర్​ ఎం.రఘునందన్​రావు (M.Raghunandan Rao) కమర్షియల్​ టాక్స్​ అదనపు బాధ్యతలు అప్పగించారు.

అలాగే ఎస్‌ హరీశ్‌ను (S Harish) దేవాదాయశాఖ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు ఇచ్చారు. భవేష్‌ మిశ్రాకు (Bhavesh Mishra) భూగర్భ గనులశాఖ డైరెక్టర్‌ బాధ్యతలు అప్పగించింది. కాంత్రి వల్లూర్​ను పదవి నుంచి తప్పించింది. అంతేకాకుండా దేవాదాయ శాఖ నుంచి శైలేజా రామయ్యను ప్రభుత్వం రిలీవ్‌ చేసింది. సిద్దిపేట అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) గరిమా అగర్వాల్‌(Garima Agarwal)ను రాజన్న సిరిసిల్ల జిల్లాకు బదిలీ చేసింది. కాగా, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్​ రిజ్వి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు.