HomeతెలంగాణFormula E Race Case | ఏసీబీ విచారణకు హాజరైన ఐఏఎస్​ అధికారి

Formula E Race Case | ఏసీబీ విచారణకు హాజరైన ఐఏఎస్​ అధికారి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Formula E Race Case | సీనియర్​ ఐఏఎస్ అధికారి అరవింద్​ కుమార్​ (IAS officer Arvind Kumar) గురువారం ఉదయం ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ-కారు రేసు వ్యవహారంలో ఏసీబీ ఆయనను ప్రశ్నిస్తోంది. ఇటీవల ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్​ను (KTR) అధికారులు విచారించిన విషయం తెలిసిందే. ఆయన స్టేట్​మెంట్​ ఆధారంగా అరవింద్​కుమార్​ను అధికారులు ప్రశ్నిస్తున్నారు.

Formula E Race Case | వేగం పెంచిన ఏసీబీ

ఫార్ములా ఈ-కారు రేసు కేసులో ఏసీబీ వేగం పెంచింది. హైదరాబాద్​లో (Hyderabad) నిర్వహించిన ఫార్ములా ఈ-కారు రేసులో (Formula E car race) అక్రమాలు జరిగాయని ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కేబినెట్​ ఆమోదం లేకుండానే అప్పటి మంత్రి కేటీఆర్​ నిధులు కేటాయించారని ఏసీబీ పేర్కొంటుంది. నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయని కేసు నమోదు (Case Registered) చేసి విచారణ చేపడుతోంది. ఈ క్రమంలో ఫార్ములా ఈ రేసులో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్​ అరవింద్​కుమార్​ను మరోసారి ప్రశ్నిస్తోంది.

Formula E Race Case | విదేశాల్లో ఉండడంతో ఆలస్యం

ఐఏఎస్​ అరవింద్​ కుమార్​ను (IAS officer Arvind Kumar) జులై 1న విచారణకు రావాలని ఏసీబీ గతంలో నోటీసులు (ACB notices) ఇచ్చింది. అయితే ఆయన విదేశాల్లో ఉండడంతో విచారణకు హాజరు కాలేదు. ఈ క్రమంలో బుధవారం మళ్లీ నోటీసులు ఇచ్చారు. గురువారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని సూచించారు. ఈ మేరకు ఆయన ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఇటీవల మాజీ మంత్రి కేటీఆర్​ (KTR) అంశాలపై అరవింద్​కుమార్​ క్రాస్​ ఎగ్జామిన్​ చేయనున్నారు.