ePaper
More
    HomeతెలంగాణGadwal MLA | నేను బీఆర్​ఎస్​లోనే ఉన్నా : గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్​రెడ్డి

    Gadwal MLA | నేను బీఆర్​ఎస్​లోనే ఉన్నా : గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్​రెడ్డి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gadwal MLA | పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో భయం నెలకొంది. ఇటీవల సుప్రీం కోర్టు (Supreme Court) తీర్పుతో వారు ఆందోళన చెందుతున్నారు.

    రాష్ట్రంలో కాంగ్రెస్​ గెలవడంతో బీఆర్​ఎస్ (BRS)​ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావ్ (భద్రాచలం), కడియం శ్రీహరి(స్టేషన్​ ఘన్​పూర్​), దానం నాగేందర్​ (ఖైరతాబాద్​), పోచారం శ్రీనివాస్​రెడ్డి (బాన్సువాడ), బండ్ల కృష్ణమోహన్​రెడ్డి(గద్వాల), కాలే యాదయ్య (చేవేళ్ల), సంజయ్​ కుమార్​ (జగిత్యాల), ప్రకాశ్​గౌడ్​ (రాజేంద్రనగర్​), అరికపూడి గాంధీ (శేరిలింగంపల్లి), మహిపాల్​రెడ్డి (పటాన్​చెరు) కాంగ్రెస్​లో చేరారు. అయితే వీరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్​ఎస్​ నాయకులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

    Gadwal MLA | సుప్రీం ఆదేశాలతో..

    బీఆర్​ఎస్​ నాయకుల పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్​ను ఆదేశించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు అందించి చర్యలు చేపట్టాలని సూచించింది. దీంతో ఆయన ఎమ్మెల్యేలకు నోటీసులు అందిస్తున్నారు. స్పీకర్​ నోటీసులతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. ఎక్కడ తమపై వేటు పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. దీంతో తాము పార్టీ మారలేదని, బీఆర్​ఎస్​లోనే కొనసాగుతున్నామని చెబుతున్నారు.

    Gadwal MLA | కాంగ్రెస్​ కండూవా కప్పుకోలేదు

    గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి (Bandla Krishnamohan Reddy)కి సైతం స్పీకర్​ నోటీసులు అందించారు. దీంతో ఆయన వివరణ ఇచ్చారు. తాను ఏ పార్టీలో చేరలేదని, బీఆర్​ఎస్​లో కొనసాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇదే అంశాన్ని స్పీకర్‌ నోటీస్‌కు సమాధానంగా పంపినట్లు చెప్పారు. తాను ఏ పార్టీ కండువా కప్పుకోలేదని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి ఉన్న 37 మంది ఎమ్మెల్యేలో తాను ఒకడిని స్పష్టం చేశారు. తాను సీఎంను కలిసిన వివరాలు స్పీకర్​కు వివరించినట్లు చెప్పారు. కేసీఆర్​ను గౌరవించే వారిలో తాను మొదటి వ్యక్తినని ఆయన తెలిపారు. పార్టీల కన్నా గద్వాల అభివృద్ధే తనకు ముఖ్యమన్నారు.

    Gadwal MLA | వారి పరిస్థితి ఏమిటో..

    బీఆర్​ఎస్​ నుంచి కాంగ్రెస్​లో చేరిన వారిలో కొందరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఖైరతాబాద్​ ఎమ్మెల్యే దానం నాగేందర్​ ఏకంగా కాంగ్రెస్​ నుంచి ఎంపీగా పోటీ చేశారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం వ్యవసాయ సలహాదారుగా నియమితులయ్యారు. కడియం శ్రీహరి తన కూతురిని కాంగ్రెస్​ ఎంపీగా గెలిపించుకున్నారు. ఒకవేళ స్పీకర్​ చర్యలు తీసుకుంటే.. వీరు తప్పించుకునే అవకాశం లేదని తెలుస్తోంది. మిగతా ఎమ్మెల్యేలు సాంకేతిక అంశాలతో పార్టీ మారలేదని చెప్పే అవకాశం ఉన్నా.. వీరికి మాత్రం ఆ ఛాన్స్​ లేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

    More like this

    Transco | నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం

    అక్షరటుడే, బోధన్​: Transco | నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యమని ట్రాన్స్​కో ఆపరేషన్స్​(Transco Operations) డీఈ ఎండీ ముక్తార్...

    Japan Prime Minister | త‌ప్పుకోనున్న జ‌పాన్ ప్ర‌ధాని.. పార్టీలో విభేదాల‌తో రాజీనామాకు నిర్ణ‌యం

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Japan Prime Minister | జపాన్ ప్రధాన మంత్రి షిగెరు ఇషిబా (Japan Prime Minister...

    ​ Bheemgal | ఇసుకను అక్రమంగా తవ్వుతున్న వ్యక్తులపై కేసు నమోదు

    అక్షరటుడే, భీమ్​గల్: ​ Bheemgal | మండలంలో బెజ్జోర గ్రామ శివారులో కప్పలవాగు (Kappalavaagu) నుండి ఇసుకను అక్రమంగా...