Hydraa | రూ.700 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైడ్రా అధికారులు (Hydra officials) ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రభుత్వ, ప్రజావసరాలకు కేటాయించిన స్థలాలను కబ్జా చెర నుంచి విడిపిస్తున్నారు. తాజాగా శుక్రవారం రూ.700 కోట్ల విలువైన భూమిని హైడ్రా కాపాడింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం (Serilingampally mandal) కొండాపూర్‌లో పార్కులు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌ను కొందరు కబ్జా చేయాలని చూశారు. అయితే హైడ్రా వారి ఆట కట్టించింది. దాదాపు 4 ఎక‌రాల మేర పార్కులు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైడ్రా అధికారులు (Hydra officials) ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రభుత్వ, ప్రజావసరాలకు కేటాయించిన స్థలాలను కబ్జా చెర నుంచి విడిపిస్తున్నారు. తాజాగా శుక్రవారం రూ.700 కోట్ల విలువైన భూమిని హైడ్రా కాపాడింది.

రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం (Serilingampally mandal) కొండాపూర్‌లో పార్కులు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌ను కొందరు కబ్జా చేయాలని చూశారు. అయితే హైడ్రా వారి ఆట కట్టించింది. దాదాపు 4 ఎక‌రాల మేర పార్కులు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాన్ని కాపాడి.. చుట్టూ ఫెన్సింగ్ వేసింది. ఈ ప్రాంతంలో ఎక‌రం రూ. 200 కోట్లు వ‌ర‌కూ ధ‌ర ప‌లుకుతోంది. ఇలా కాపాడిన భూమి విలువ దాదాపు రూ.700 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని అంచ‌నా.

Hydraa | పార్కు స్థలాల విక్రయం

కొండాపూర్ విలేజ్‌(Kondapur Village)లో 57.20 ఎక‌రాల విస్తీర్ణంలో 627 ప్లాట్ల‌తో శ్రీ వేంక‌టేశ్వ‌ర హెచ్ఏఎల్ కాల‌నీని 1980లో ఏర్పాటు చేశారు. 1.20 ఎక‌రాల చొప్పున 2 పార్కులు, 2 ఎక‌రాల ప‌రిధిలో మ‌రో పార్కుతో పాటు.. 1000 గ‌జాల మేర ప్ర‌జావ‌స‌రాల‌కు స్థ‌లాల‌ను కేటాయించారు. ఇప్ప‌డివే ఆక్ర‌మ‌ణ‌ల‌కు గుర‌య్యాయి. పార్కుల‌ను బైనంబ‌ర్ల ద్వారా ప్లాట్లుగా మార్చేసి విక్రయించారు. వేంక‌టేశ్వ‌ర హెచ్ఏఎల్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేష‌న్ ప్ర‌తినిధులు దీనిపై హైడ్రాకు ఫిర్యాదు చేశారు.

Hydraa | కోర్టు ఆదేశాలతో..

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదును హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పార్కు స్థలాను ప్లాట్లుగా మార్చినట్లు గుర్తించారు. 1.20 ఎక‌రాల మేర ఉండాల్సిన పార్కును 11 ప్లాట్లు చేసి అమ్మేసిన‌ట్టు తేల్చారు. మ‌రో రెండు పార్కుల‌ను కూడా అలాగే బై నంబ‌ర్ల‌తో విక్రయించారు. రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేష‌న్ ప్ర‌తినిధులు హైకోర్టును (High Court) కూడా ఆశ్ర‌యించారు. పార్కుల‌తో పాటు ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌ను కాపాడాల‌ని హైకోర్టు సూచించింది. దీంతో హైడ్రా శుక్ర‌వారం పార్కుల చుట్టూ ఫెన్సింగ్ వేసి, బోర్డుల‌ను ఏర్పాటు చేసింది. దీంతో స్థానికులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

Related articles

Virosh Wedding Celebrations | ఉదయ్‌పూర్‌లో ‘విరోష్’ పెళ్లి వేడుకలు ప్రారంభం.. పూల్ పార్టీ, జపనీస్ థీమ్ డిన్నర్‌తో సందడి

టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ–రష్మిక మందన్న వివాహ వేడుకలు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 26న పెళ్లి పీటలెక్కనున్న ఈ జంట ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌ను అత్యంత సన్నిహితుల మధ్య నిర్వహిస్తోంది. సోమవారం పూల్ పార్టీ, జపనీస్ థీమ్ క్యాండిల్‌లైట్ డిన్నర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Maoist Leaders Surrender | నేడు మీడియా ముందుకు మావోయిస్ట్ అగ్రనేతలు

మావోయిస్ట్​ పార్టీ అగ్రనేతలు దేవ్​జీ, రాజిరెడ్డి ఇటీవల లొంగిపోయిన విషయం తెలిసిందే. డీజీపీ శివధర్​రెడ్డి వారి వివరాలు వెల్లడించనున్నారు.

Feb 24 Gold Prices | మళ్లీ భగ్గుమన్న బంగారం, వెండి.. ఒక్కరోజులోనే భారీగా పెరిగిన ధ‌ర‌లు

అక్షరటుడే, హైదరాబాద్​: Feb 24 Gold Prices | దేశంలో మళ్లీ బంగారం, వెండి ధరలు ప‌రుగులు పెడుతున్నాయి.. కాస్త తగ్గుతుందని సంతోషపడ్డ వినియోగదారుల్లో...

Feb 24 Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్‌డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌నిఫ్టీ

Feb 24 Pre Market Analysis | గ్లోబల్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. మన మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని గిఫ్ట్ నిఫ్టీ...