Hydraa | రూ.3 వేల కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ప్రభుత్వ భూములు (government lands), చెరువులు, పార్కులను కబ్జా చెరల నుంచి విడిపిస్తోంది. తాజాగా మియాపూర్​లో భారీ ఆపరేషన్ చేపట్టింది. రంగారెడ్డి జిల్లా (Ranga Reddy district) శేరిలింగంపల్లి మండలం మియాపూర్ విలేజ్ మక్తా మ‌హ‌బూబ్‌ పేటలో ఆక్ర‌మ‌ణ‌ల‌ను శుక్రవారం హైడ్రా తొలగించింది. స‌ర్వే నంబర్ 44 లో 15 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని కాపాడింది. ఈ సర్వే నంబర్​లో ప్రభుత్వ భూమి […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ప్రభుత్వ భూములు (government lands), చెరువులు, పార్కులను కబ్జా చెరల నుంచి విడిపిస్తోంది. తాజాగా మియాపూర్​లో భారీ ఆపరేషన్ చేపట్టింది.

రంగారెడ్డి జిల్లా (Ranga Reddy district) శేరిలింగంపల్లి మండలం మియాపూర్ విలేజ్ మక్తా మ‌హ‌బూబ్‌ పేటలో ఆక్ర‌మ‌ణ‌ల‌ను శుక్రవారం హైడ్రా తొలగించింది. స‌ర్వే నంబర్ 44 లో 15 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని కాపాడింది. ఈ సర్వే నంబర్​లో ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురి అవుతున్నట్టు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు అందింది. దీంతో గతంలో హైడ్రా అధికారులు (HYDRA officials) 5 ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు. మియాపూర్ – బాచుప‌ల్లి ప్ర‌ధాన ర‌హ‌దారికి స‌మాంత‌రంగా ఉన్న చెరువు క‌ట్ట‌పై 200మీట‌ర్ల మేర వేసిన 18 షెట్ట‌ర్ల‌ను గ‌తంలోనే తొల‌గించింది. తాజాగా మరో 15 ఎకరాల భూమిని కాపాడింది. ఈ భూమిని కొందరు తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్​ చేసుకున్నారు. హైడ్రా కాపాడిన భూమి విలువ రూ.3 వేల కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.

Hydraa | జలమండలి భూమి..

హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB)కి చెందిన 4.01 ఎకరాల భూమిని హైడ్రా పరిరక్షించింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా (Medchal-Malkajgiri district) కీసర మండలం, రాంపల్లి గ్రామంలోని జలమండలి అవసరాల కోసం ప్రభుత్వం ఈ భూమిని కేటాయించింది. కొందరు ఈ భూమిని ఆక్రమించుకొని ప్రహరీ నిర్మించే యత్నం చేశారు. దీనిపై జలమండలి అధికారులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా అధికారులు క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించారు. జలమండలి భూమిగా నిర్ధారించుకొని శనివారం 4.01 ఎకరాల భూమి చుట్టూ కంచెను హైడ్రా ఏర్పాటు చేసింది.

Related articles

Exam Center Security | పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు: ఎస్పీ రాజేష్ చంద్ర

పరీక్ష కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.

TTD Digital Offerings | తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం కొత్త నిర్ణయం.. ‘శ్రీవారి ముడుపు పత్రం’తో డిజిటల్ కానుకల సౌకర్యం

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు డిజిటల్ రూపంలో హుండీ కానుకలు సమర్పించేందుకు టీటీడీ ‘శ్రీవారి ముడుపు పత్రం’ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టనుంది. యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించి ప్రత్యేక పత్రాన్ని హుండీలో వేయే సౌకర్యం కల్పించనుంది.

Tirumala Ghat Road Accident | తిరుమల ఘాట్​ రోడ్డులో ప్రమాదం.. ఒకరి మృతి

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన భక్తుడు మృతి చెందాడు.

Armur Municipal Council | ఆర్మూర్​ బల్దియా పాలకవర్గం బాధ్యతల స్వీకరణ

ఆర్మూర్​ మున్సిపల్ పాలకవర్గం గురువారం కొలువుదీరింది. మున్సిపల్ ఛైర్​పర్సన్​గా గోనె లహరి, వైస్ ఛైర్మన్​గా కాటిపల్లి వెంకటరెడ్డితో పాటు కౌన్సిలర్లు బాధ్యతలు స్వీకరించారు.