అక్షరటుడే, వెబ్డెస్క్: Hydraa Police Station | ఆక్రమణదారులను అడ్డుకోవడానికి హైడ్రా ఏర్పాటు చేశామని సీఎం రేవంత్ రెడ్డి (CM revanth reddy) స్పష్టం చేశారు. చెరువులు ఆక్రమించిన వ్యక్తులు ఎంత పెద్దవారైనా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. గురువారం ఆయన హైదరాబాద్లో హైడ్రా పోలీస్స్టేషన్ (hyderabad hydra Police Station), వెబ్సైట్ను ప్రారంభించారు.
అనంతరం సీఎం (CM revanth reddy) మాట్లాడుతూ.. హైదరాబాద్లో చిన్న వర్షం కురిస్తే రోడ్లపై గంటల తరబడి నీరు నిలిచిపోతుందన్నారు. నాలాల ఆక్రమణల వల్లే నీళ్లు రోడ్లపైకి వస్తున్నాయన్నారు. ఈ నగరాన్ని ఇలాగే నిర్లక్ష్యానికి బలిచేద్దామా అని ప్రశ్నించారు. చిన్న వర్షానికే ఉస్మానియా ఆస్ప్రత్రి (osmania hospital) మునిగిపోయిందన్నారు. చెరువులు ఆక్రమించిన వారు ఎంత పెద్దవారైనా వదిలేది లేదన్నారు. హైదరాబాద్లో 960 చెరువులు ఉండాల్సి ఉండగా.. 461 కబ్జాకు గురయ్యాయని చెప్పారు. మెట్రో పాలిటన్ సిటీల్లో (metro politan cities) నివసించలేని పరిస్థితి నెలకొందన్నారు.
కాలుష్యంతో ఢిల్లీ (delhi polution) తల్లడిల్లుతోందని పేర్కొన్నారు. నీటి నిల్వలను ఒడిసి పట్టుకోకపోవడం వల్లే బెంగళూరు విలవిల్లాడుతోందన్నారు. బెంగళూరు ప్రజలు (bengaluru people) వలసపోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. చిన్న వర్షం పడితే ముంబయిలో (mumbai city) పనిచేసే పరిస్థితి ఉండదన్నారు. ఇది ప్రకృతి విపత్తు కాదని.. మానవ తప్పిదమన్నారు. గుణపాఠం నేర్చుకోకపోతే హైదరాబాద్ (hyderabad) సైతం ఆ సిటీల సరసన చేరుతుందన్నారు. ప్రకృతిని కాపాడుకుంటే (save nature) కొందరికి వచ్చిన ఇబ్బందేమిటని ప్రశ్నించారు. హైడ్రా అనేది కేవలం కూలగొట్టడానికి మాత్రమే కాదని సీఎం స్పష్టం చేశారు.