Hyderabad Police | నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Police | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో దారుణం చోటు చేసుకుంది. నడిరోడ్డుపై ఓ వ్యక్తిని కొంతమంది దుండగులు హత్య చేశారు. నగరంలోని భరత్ నగర్ (Bharath Nagar) బ్రిడ్జి పక్కన శంకర్(48) అనే వ్యక్తిని కత్తులతో పొడిచి దుండగులు చంపారు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. శంకర్​ కర్ణాటక (Karnataka) నుంచి బతుకు దెరువు కోసం నగరానికి వచ్చినట్లు […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Police | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో దారుణం చోటు చేసుకుంది. నడిరోడ్డుపై ఓ వ్యక్తిని కొంతమంది దుండగులు హత్య చేశారు.

నగరంలోని భరత్ నగర్ (Bharath Nagar) బ్రిడ్జి పక్కన శంకర్(48) అనే వ్యక్తిని కత్తులతో పొడిచి దుండగులు చంపారు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. శంకర్​ కర్ణాటక (Karnataka) నుంచి బతుకు దెరువు కోసం నగరానికి వచ్చినట్లు గుర్తించారు. అతడు మూసాపేటలోని ఓ హోటల్​లో రెండేళ్లుగా పని చేస్తున్నాడు. అయితే ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Hyderabad Police | పెరుగుతున్న హత్యలు

కాగా నగరంలో ఇటీవల హత్యలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా నడిరోడ్డుపై ప్రాణాలు తీయడానికి సైతం కొందరు వెనుకాడం లేదు. చాలా వరకు హత్యలకు ఆస్తి తగదాలు, వివాహేతర సంబంధాలు కారణం అవుతున్నాయి. గతంలో నగరంలోని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్​ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. షాహీన్ నగర్‌లో అమెర్ (32) అనే వ్యక్తిపై కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడు​ అక్కడికక్కడే మృతి చెందాడు. జవహర్​నగర్​ పోలీస్​ స్టేషన్​ (Jawaharnagar Police Station) పరిధిలోని సాకేత్​ కాలనీలో ఇటీవల ఓ రియల్టర్​ను దుండగులు హత్య చేశారు. రియల్టర్‌ వెంకటరత్నం స్కూటీపై వెళ్తుండగా.. సాకేత్​ కాలనీలోని ఫోస్టర్​ స్కూల్​సమీపంలోకి రాగానే అతడిపై దాడి చేశారు. నడిరోడ్డుపై షూట్‌ చేశారు. అనంతరం కత్తులతో పొడిచి హత్య చేశారు. పాతబస్తీలోని రెయిన్​ బజార్​ పోలీస్​ స్టేషన్​ (Rain Bazaar Police Station) పరిధిలో సైతం ఓ రియల్​ ఎస్టేట్​ వ్యాపారి హత్యకు గురయ్యాడు.

Srinivas kolluri
Srinivas kollurihttps://www.aksharatoday.in/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తాను.

Related articles

IFS Mains Results 2025 | ఇండియన్​ ఫారెస్ట్​ సర్వీస్​ మెయిన్స్​ ఫలితాలు విడుదల

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IFS Mains Results 2025 | ఇండియన్​ ఫారెస్ట్​ సర్వీస్ (Indian Forest Service) మెయిన్స్​​ ఫలితాలను యూపీఎస్సీ విడుదల...

Inter Exams in Nizamabad | ప్రశాంతంగా ఇంటర్​ పరీక్షలు ప్రారంభం

అక్షరటుడే, ఇందూరు: Inter Exams in Nizamabad | జిల్లావ్యాప్తంగా ఇంటర్​ పరీక్షలు (Inter Exams) ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి...

IDFC first Bank fraud case | ఐడీఎప్​సీ ఫస్ట్​ బ్యాంక్​లో రూ.590 కోట్ల మోసం.. నలుగురి అరెస్ట్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IDFC first Bank fraud case | ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​లో రూ.590 కోట్ల భారీ మోసం వెలుగు చూసింది....

Telangana temperature rise | వర్షాలు బంద్​.. పెరగనున్న ఉష్ణోగ్రతలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana temperature rise | బంగాళాఖాతం (Bay of Bengal)లో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మూడు రోజులుగా...