Hyderabad Cyber Crime Arrests | 104 మంది సైబర్​ నేరగాళ్ల అరెస్ట్​.. నిందితుల్లో బ్యాంకు ఉద్యోగులు

హైదరాబాద్ సైబర్​ క్రైమ్​​ పోలీసులు భారీ ఆపరేషన్​ చేపట్టారు. 104 మంది నిందితులను అరెస్ట్ చేశారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Cyber Crime Arrests | హైదరాబాద్​ పోలీసులు (Hyderabad Police) భారీ ఆపరేషన్​ చేపట్టారు. సైబర్​ నేరాలకు పాల్పడుతున్న 104 మంది నిందితులను అరెస్ట్ చేశారు.

దేశంలో రోజురోజుకు సైబర్​ నేరాలు (Cyber ​​Crimes) పెరుగుతున్నాయి. కొత్త కొత్త మార్గాల్లో కేటుగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారు. హైదరాబాద్​ నగరంలో నిత్యం ఎంతో మంది మోసపోతున్నారు. ఈ క్రమంలో సైబర్​ క్రైమ్​ పోలీసు (Cyber ​​Crime Police)లకు అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో పోలీసులు ఆక్టోపస్‌ పేరుతో స్పెషల్​ ఆపరేషన్​ చేపట్టారు. 16 రాష్ట్రాల్లో 104 మంది సైబర్‌ నేరగాళ్లని అరెస్ట్​ చేశారు. నిందితుల్లో బ్యాంకు ఉద్యోగులు సైతం ఉండటం గమనార్హం.

Hyderabad Cyber Crime Arrests | రూ.127 కోట్ల సైబర్​ మోసాలు

నిందితుల నుంచి పోలీసులు రూ.36 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. రెండు వందలకు పైగా ఫోన్లు సీజ్​ చేశారు. వీరిపై దేశవ్యాప్తంగా 1,055 కేసులు ఉండగా.. ఇప్పటివరకు వీరు రూ.127 కోట్లకు పైగా కాజేసినట్లు గుర్తించారు. సైబర్​ నేరాలపై తెలంగాణ పోలీసులు (Telangana Police) కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఓ వైపు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నారు. మరోవైపు నిందితులను సైతం అదుపులోకి తీసుకుంటున్నారు. గతంలో కూడా పలు రాష్ట్రాల్లో ప్రత్యేక ఆపరేషన్​ చేపట్టి సైబర్​ నేరస్తులను తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు. అయితే తాజాగా అరెస్ట్​ అయిన వారిలో బ్యాంకు ఉద్యోగులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రజల డబ్బును కాపాడాల్సిన వారు.. సైబర్​ నేరస్తులతో కలిసి మోసాలకు పాల్పడుతుండటం గమనార్హం. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Related articles

KTR BRS Statement | బీఆర్​ఎస్​ అధికారంలోకి రాగానే కాంగ్రెస్​ అరాచకాలను బయటపెడతాం: బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​

బీఆర్​ఎస్​ అధికారంలోకి రాగానే కాంగ్రెస్​ అరాచకాలను ఒక్కొక్కటిగా బయటపెడతామని కేటీఆర్​ అన్నారు. హైదరాబాద్​ నుంచి ఆదిలాబాద్​ వెళ్తూ ఆర్మూర్​లో ఆగారు.

Arvind Ukraine Group | ఉక్రెయిన్ పార్లమెంటరీ ఫ్రెండ్​షిప్ గ్రూప్ టీం లీడర్​గా ఎంపీ అర్వింద్

ఉక్రెయిన్ పార్లమెంటరీ ఫ్రెండ్​షిప్ గ్రూప్ టీం లీడర్​గా ఎంపీ అర్వింద్ నియమితులయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం ఈ బృందం లక్ష్యం.

Tirumala Laddu Adulteration Issue | తిరుమల లడ్డూ కల్తీపై అసెంబ్లీలో చర్చ.. కుట్ర ఉందన్న సీఎం

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. 2019-24 మధ్య దేవాలయాల్లో అరాచకాలు జరిగాయని సీఎం చంద్రబాబు అన్నారు.

Lawyers Protest Nizamabad | జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదుల నిరసన.. దాడి చేసిన వారిని అరెస్ట్​ చేయాలని డిమాండ్​

న్యాయవాదిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని లాయర్లు డిమాండ్​ చేశారు. ఈ మేరకు మంగళవారం నిజామాబాద్ బార్​ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి కోర్టు ఎదుట ధర్నా చేశారు.