Hyderabad Family Suicide | హైదరాబాద్​లో విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య

హైదరాబాద్​లోని అంబర్​పేటలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్:Hyderabad Family Suicide | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు.

అంబర్‌పేట (Amberpet)లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఇంట్లో ఉరి వేసుకొని తనువు చాలించారు. ఏం కష్టం వచ్చిందో ఏమో గాని వారు ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతులను రామరాజు (55), మాధవి (50), శశాంక్‌ (24)గా పోలీసులు గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad Family Suicide | తలుపులు తీయకపోవడంతో..

రామరాజు తన కుటుంబంతో కలిసి అంబర్​పేటలో ఉంటున్నాడు. మంగళవారం ఉదయం ఎంతసేపటికి ఇంటి తలుపులు తీయకపోవడంతో స్థానికులు అనుమానంతో పిలిచారు. లోపలి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చూసే సరికి ముగ్గురు ఉరి వేసుకొని చనిపోయారు. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా పోలీసులు క్లూస్​ టీమ్​ సాయంతో ఆధారాలు సేకరించారు. వారి బంధువులను విచారిస్తున్నారు. కాగా నగరంలో ఇటీవల ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

Related articles

Arvind Ukraine Group | ఉక్రెయిన్ పార్లమెంటరీ ఫ్రెండ్​షిప్ గ్రూప్ టీం లీడర్​గా ఎంపీ అర్వింద్

ఉక్రెయిన్ పార్లమెంటరీ ఫ్రెండ్​షిప్ గ్రూప్ టీం లీడర్​గా ఎంపీ అర్వింద్ నియమితులయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం ఈ బృందం లక్ష్యం.

Tirumala Laddu Adulteration Issue | తిరుమల లడ్డూ కల్తీపై అసెంబ్లీలో చర్చ.. కుట్ర ఉందన్న సీఎం

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. 2019-24 మధ్య దేవాలయాల్లో అరాచకాలు జరిగాయని సీఎం చంద్రబాబు అన్నారు.

Lawyers Protest Nizamabad | జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదుల నిరసన.. దాడి చేసిన వారిని అరెస్ట్​ చేయాలని డిమాండ్​

న్యాయవాదిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని లాయర్లు డిమాండ్​ చేశారు. ఈ మేరకు మంగళవారం నిజామాబాద్ బార్​ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి కోర్టు ఎదుట ధర్నా చేశారు.

Harish Rao Demands Halt | పేదల ఇళ్ల కూల్చివేతలను ఆపాలి : హరీశ్​రావు

ఖమ్మం జిల్లా వినోబానగర్‌లో పేదల ఇళ్ల కూల్చివేతలను ఆపాలని హరీశ్​రావు డిమాండ్​ చేశారు. ప్రభుత్వ తీరును ఆయన ఖండించారు.