Nizamabad fourth town police
Nizamabad | భార్యను చంపిన భర్త

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : Nizamabad | నిజామాబాద్ నగరం (Nizamabad City)లోని నాలుగో టౌన్ (Fourth Town) పరిధిలో గల టెలికం కాలనీకి చెందిన నిఖితను భర్త నరేష్ హత్య చేశాడు. నరేశ్​, నిఖిత మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి కూడా వారు గొడవపడ్డారు. ఆవేశానికి గురైన నరేష్ భార్యను గట్టిగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. నాలుగో టౌన్​ ఎస్సై శ్రీకాంత్ (Fourth Town SI Srikanth) ​ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.