అక్షరటుడే, కామారెడ్డి: Sadashivnagar | భార్యపై రాయితో దాడి చేసి హత్య చేసిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రీనివాస్ రావు (DSP Srinivas Rao) వివరాలు వెల్లడించారు.
సదాశివనగర్ గ్రామానికి (Sadashivnagar village) చెందిన చిందం రవి కుటుంబ కలహాల కారణంగా ఈనెల 22న రాత్రి తన భార్య లక్ష్మి (40)పై బండరాయితో దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. హైదరాబాద్లో (Hyderabad) ఉద్యోగం చేస్తున్న కుమారుడు సురేష్ 23న ఉదయం ఇంటికి వచ్చాడు. తల్లి మృతదేహం కనిపించడంతో వెంటనే సదాశివనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. నిందితుడు రవిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇంట్లో గొడవ జరిగింది. దీంతో కోపానికి గురైన రవి తన భార్య లక్ష్మిని బండరాయితో కొట్టి దారుణంగా హత్య చేసినట్లు విచారణలో తేలింది.