ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​TGS RTC | ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్లలో భారీగా బస్సు ఛార్జీల తగ్గింపు

    TGS RTC | ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్లలో భారీగా బస్సు ఛార్జీల తగ్గింపు

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: TGS RTC | బస్సు ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ (TGSRTC) శుభవార్త తెలిపింది. హైదరాబాద్ నుంచి విజయవాడ (Vijayawada) మార్గంలో టికెట్ ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.

    TGS RTC | ఏ బస్సులో ఎంత తగ్గింపు అంటే..

    హైదరాబాద్ నుంచి విజయవాడ మార్గంలో నడిచే బస్సుల ఆధారంగా ఈ తగ్గింపు వర్తించనుంది. గరుడ బస్ టికెట్ ధరలపై 30 శాతం తగ్గిస్తోంది ఆర్టీసీ సంస్థ. ఈ-గరుడ బస్ టికెట్ ధరలపై 26 శాతం తగ్గించడం గమనార్హం. సూపర్ లగ్జరీ, లహరి నాన్ ఏసీ బస్సుల టికెట్లపై 20 శాతం మేర తగ్గించింది. రాజధాని Rajdhani, లహరి Lahari ఏసీ బస్సుల్లో టికెట్ ధరలపై 16 శాతం తగ్గించడం విశేషం.

    TGS RTC | పెరిగిన బస్​ పాస్​ ధరలు..

    విజయవాడ మార్గంలో టికెట్ ధరలపై రాయితీ ప్రకటించిన టీజీఎస్ ఆర్టీసీ సంస్థ హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో మాత్రం బాదుతోంది. సిటీ బస్సుల్లో బస్ పాస్ రేట్లను జూన్​లోనే పెంచి అమలు చేస్తోంది. ఆర్డినరీ బస్​ పాస్​లపై 23 శాతం పెంచింది. స్టూడెంట్​ బస్​ పాస్​లపై ఏకంగా 50 శాతం రేట్లు పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకోవడం ఆందోళన కలిగించే విషయం.

    TGS RTC | మూడేళ్లుగా పెంచలేదని…

    గత మూడేళ్లుగా స్టూడెంట్ బస్ పాస్ రేట్లు పెంచలేదని ఆర్టీసీ సంస్థ తెలిపింది. ఆర్థిక భారం తగ్గించుకునేందుకే పెంచినట్లు చెప్పుకొచ్చింది. కాగా, ఈ విద్యా సంవత్సరంలో మెట్రో ఎక్స్ ప్రెస్​లోనూ స్టూడెంట్స్ ప్రయాణించేందుకు అనుమతిస్తున్నట్లు ప్రకటించింది.

    TGS RTC | టోల్​ ఛార్జీల సవరణ..

    టోల్ ప్లాజా యూజర్ ఛార్జీలను సైతం సవరించినట్లు టీజీఎస్​ ఆర్టీసీ సంస్థ వెల్లడించింది. టోల్ గేట్​ మీదుగా వెళ్లే ప్రతి ప్రయాణికుడు అదనంగా ప్లాజాకు రూ.10 చెల్లించాలని ప్రకటించింది. టోల్​ గేట్​ లేకపోతే చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది.

    TGS RTC | అక్కడ రాయితీ.. ఇక్కడ మోత..!

    స్థానికంగా లోకల్​లో తిరిగే స్టూడెంట్​ బస్​ పాస్​లపై భారీగా పెంచిన టీజీఎస్​ ఆర్టీసీ సంస్థ.. ఆంధ్రప్రదేశ్​కు వెళ్లే ప్రయాణికులకు రాయితీ ప్రకటించడంపై సర్వత్రా చర్చకు దారితీసింది. సంస్థపై ఆర్థిక భారం పడుతుందని కుంటిసాకులు చెప్పి, హైదరాబాద్​ మహానగరంలో ప్రయాణికులకు బస్​పాస్​లపై భారం మోపిన సంస్థ.. సుదూర ప్రయాణికులకు మాత్రం రాయితీలు కల్పించడంపై విమర్శలు వస్తున్నాయి. దీనికితోడు టోల్​ గేట్​కు రుసుం చెల్లించాల్సి ఉంటుందని ఒకవైపు చెబుతూనే.. మరోవైపు రాయితీ తాయిలాలు ఇవ్వడం వెనుక మర్మమేమిటో టీజీఎస్​ ఆర్టీసీ సంస్థనే తెలపాలి.

    Latest articles

    GST fraud | భారీ జీఎస్టీ మోసం.. రూ.100 కోట్లకు పైగా నకిలీ ఇన్‌వాయిస్‌ల స్కామ్

    అక్షరటుడే, హైదరాబాద్: GST fraud : తెలంగాణ(Telangana)లో భారీ జీఎస్టీ మోసం వెలుగుచూసింది. వాణిజ్య పన్నుల శాఖ తనిఖీల్లో...

    Officers Retirement | ఒకేసారి ఐదుగురు అధికారుల పదవీ విరమణ.. వీడ్కోలు పలికిన ఆయా శాఖల సిబ్బంది

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Officers Retirement : నిజామాబాద్ జిల్లా(Nizamabad district)లో వివిధ శాఖలలో విధులు నిర్వర్తిస్తున్న ఐదుగురు...

    Collector | కమ్మర్​పల్లి, మోర్తాడ్​లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు.. ఆయిల్ పామ్ నర్సరీ సందర్శన

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Collector : కమ్మర్ పల్లి, మోర్తాడ్ (Mortad)మండల కేంద్రాలలో బుధవారం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి...

    Task force raids | వ్యభిచార గృహంపై టాస్క్ ఫోర్స్ దాడి.. పలువురి అరెస్టు

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Task force raids : నిజామాబాద్ నగరంలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది మెరుపు దాడులు...

    More like this

    GST fraud | భారీ జీఎస్టీ మోసం.. రూ.100 కోట్లకు పైగా నకిలీ ఇన్‌వాయిస్‌ల స్కామ్

    అక్షరటుడే, హైదరాబాద్: GST fraud : తెలంగాణ(Telangana)లో భారీ జీఎస్టీ మోసం వెలుగుచూసింది. వాణిజ్య పన్నుల శాఖ తనిఖీల్లో...

    Officers Retirement | ఒకేసారి ఐదుగురు అధికారుల పదవీ విరమణ.. వీడ్కోలు పలికిన ఆయా శాఖల సిబ్బంది

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Officers Retirement : నిజామాబాద్ జిల్లా(Nizamabad district)లో వివిధ శాఖలలో విధులు నిర్వర్తిస్తున్న ఐదుగురు...

    Collector | కమ్మర్​పల్లి, మోర్తాడ్​లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు.. ఆయిల్ పామ్ నర్సరీ సందర్శన

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Collector : కమ్మర్ పల్లి, మోర్తాడ్ (Mortad)మండల కేంద్రాలలో బుధవారం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి...