అక్షరటుడే, వెబ్డెస్క్ : Japan | జపాన్ ఫస్ట్ పార్టీ (Japan First Party) ఆధ్వర్యంలో ఆ దేశంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఇస్లామిస్టులను, ముఖ్యంగా కుర్దు ముస్లింలను (Kurdu Muslims) జపాన్ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీ నిర్వహించడం గమనార్హం. 1990 కాలంలో జపాన్లో కుర్దు ముస్లిం జనాభా తక్కువగా ఉండేది. కానీ గత ఐదేళ్లలో వీరి సంఖ్య విపరీతంగా పెరిగింది. కుర్దులు ఎక్కువగా టర్కీలో నివసిస్తుంటారు. వీరి జనాభా పెరుగుదలతో ఆందోళన వ్యక్తం చేసిన ఫస్ట్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన చేపట్టింది. కుర్దు ముస్లింలను వెంటనే దేశం నుంచి పంపించేయాలని డిమాండ్ చేసింది. ఈ ఆందోళనల్లో జపాన్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
