అక్షరటుడే, వెబ్డెస్క్ : Gold | శంషాబాద్ ఎయిర్పోర్టులో (Shamshabad Airport) అధికారులు భారీగా బంగారం gold పట్టుకున్నారు. దుబాయ్ (dubai) నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 3.5 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు డీఆర్ఐ అధికారులు(DRI Officers) గుర్తించారు. పసిడికి సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసి, కేసు నమోదు చేశారు. కాగా స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.3 కోట్లకుపైనే ఉంటుందని అంచనా.