అక్షరటుడే, వెబ్డెస్క్ : Gold | ముంబై ఎయిర్పోర్ట్(mumbai airport)లో అధికారులు భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్పోర్టులో పనిచేస్తున్న ఇద్దరు సిబ్బంది అక్రమంగా బంగారం gold smugling తరలిస్తుండగా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 5.75 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.5 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.
ఎయిర్పోర్ట్లో పని చేస్తున్న ఓ వ్యక్తి లోదుస్తుల్లో రూ.2.48 కోట్ల విలువైన 2.8 కిలోల బంగారం తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి ఆరు పౌచ్లు స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న ఒక వ్యక్తి కదలికలపై అనుమానం రావడంతో అధికారులు తనిఖీ చేశారు. అతను ధరించిన జాకెట్ జేబు నుంచి రూ. 2.62 కోట్ల విలువైన 2.95 కేజీల బంగారం ఉన్న 6 పౌచ్లను స్వాధీనం చేసుకున్నాడు. వీరికి ఓ ట్రాన్సిట్ ప్రయాణికుడు transit passenger బంగారం ఇచ్చినట్లు గుర్తించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని బంగారం స్వాధీనం చేసుకున్నారు.