అక్షరటుడే, వెబ్డెస్క్: Jammu Kashmir | భారత్ ఆపరేషన్ సిందూర్తో (Operation Sindoor) పాకిస్తాన్, ఆ దేశంలోని ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పిన విషయం తెలిసిందే. అయినా కూడా దాయాదీ దేశం బుద్ధి మార్చుకోవడం లేదు. డ్రోన్ల ద్వారా భారత్లోకి ఆయుధాలు రవాణా చేస్తోంది. ఇక్కడ ఉన్న ఉగ్రవాదుల ద్వారా దాడులకు ప్రణాళికలు రచిస్తోంది. తాజాగా భద్రతా బలగాలు జమ్మూ కశ్మీర్లో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
జమ్మూ కశ్మీర్లోని పూంచ్ జిల్లాలో ఖానటర్ ప్రాంతంలో డ్రోన్ ద్వారా పేలుడు పదార్థాలు, ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రిని జార విడిచారు. రోమియో ఫోర్స్, పూంచ్ SOG సంయుక్తంగా నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్లో డ్రోన్ వదిలిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిల్లో ఆరు చైనీస్ గ్రెనేడ్లు, రెండు పాకిస్తాన్ తయారు చేసిన పిస్టల్స్, 3 మ్యాగజైన్లు, ఒక అండర్-బారెల్ గ్రెనేడ్ లాంచర్, ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్ (IED) రిమోట్ కంట్రోల్ ఉన్నాయి.
Jammu Kashmir | తీరు మార్చుకోని పాకిస్తాన్
పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జమ్మూ కశ్మీర్లోని (Jammu and Kashmir) పహల్గామ్లో (Pahalgam) ఏప్రిల్ 22న పర్యాటకులపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 26 మంది మృతి చెందారు. అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాకిస్తాన్(Pakistan), పీవోకేలోని (POK) తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. ఈ ఘటనలో 100 మంది వరకు మరణించారు. అనంతరం పాక్ ప్రతీకార దాడులు చేయడంతో భారత్ తీవ్రంగా స్పందించింది. బ్రహ్మోస్(Brahmos) క్షిపణులతో పాక్లోని ఎయిర్బేస్లు, మిలటరీ స్థావరాలను ధ్వంసం చేసింది. దీంతో పాక్ కాళ్ల బేరానికి వచ్చి కాల్పుల విరమణ ప్రతిపాదన తీసుకు రాగా భారత్ అంగీకరించింది. అయినా తీరు మారని పాకిస్తాన్ మళ్లీ ఆయుధాలు పంపిస్తుండటం గమనార్హం.