Nagavalli Express
Nagavalli Express | నాగవల్లి ఎక్స్​ప్రెస్​లో భారీగా ఎండు గంజాయి స్వాధీనం

అక్షరటుడే, కామారెడ్డి: Nagavalli Express | రైలులో అక్రమంగా తరలిస్తున్న ఎండుగంజాయిని కామారెడ్డి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (Kamareddy Railway Protection Force), ఎక్సైజ్ అధికారులు (Excise officials) పట్టుకున్నారు. ఎక్సైజ్ సీఐ సంపత్ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం సంబల్​పూర్ నుంచి నాందేడ్​కు (Sambalpur to Nanded) వెళ్తున్న నాగవల్లి ఎక్స్​​ప్రెస్​లో ఎండు గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం వచ్చింది. దీంతో వెంటనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ఎక్సైజ్​ అధికారులు కామారెడ్డి రైల్వే స్టేషన్​లో (Kamareddy Railway Station) తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా ఉన్న బ్యాగు తెరిచి చూడగా 12 కిలోల ఎండు గంజాయి ఉన్నట్టు గుర్తించారు. అనంతరం గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు. నిషేధిత మత్తు పదార్థాలు తరలిస్తే ఎన్​డీపీఎస్​ యాక్ట్​ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. దాడుల్లో ఎక్సైజ్ ఎస్సై విక్రమ్ కుమార్, రైల్వే ఎస్సై వెంకటేశ్వర్లు, ఏఎస్సై రవీంద్ర బాబు, సిబ్బంది పాల్గొన్నారు.