అక్షరటుడే, వెబ్డెస్క్ : Google Map | ప్రస్తుతం సాంకేతిక పెరిగింది. చేతిలో స్మార్ట్ఫోన్(Smartphone) ఉంటే చాలు అన్ని తెలుసుకోవచ్చు. దీంతో ప్రస్తుతం ప్రజలు టెక్నాలజీకి బానిసలు అయిపోయారు. ప్రతిదానికి ఫోన్ను వినియోగిస్తున్నాం. గతంలో ఎక్కడికైనా వెళ్లాలంటే దారి తెలియకపోతే ఆ మార్గంలోని స్థానికులను అడుగుతూ వెళ్లేవాళ్లం. ప్రస్తుతం గూగుల్ మ్యాప్స్(Google Maps) సాయంతో ఎక్కడా ఆగకుండా దూసుకుపోతున్నాం. అయితే అప్పుడప్పుడు గూగుల్ మ్యాప్ చేసే పొరపాట్లతో వాహనాదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.
ప్రస్తుతం ఎక్కడికైనా వెళ్లాలంటే గూగుల్ మ్యాప్లో డెస్టినేషన్(Destination) సెలెక్ట్ చేసుకొని అది చెప్పిన మార్గంలో వెళ్తున్నారు. ఇలాగే వెళ్తూ ఇటీవల ఓ కారు ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో నిర్మాణంలో ఉన్న వంతెనపై నుంచి కింద పడింది. తాజాగా తెలంగాణ (Telangana)లోని జనగామలో సైతం గూగుల్ మ్యాప్ని నమ్ముకొని వెళ్తున్న ప్రయాణికులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు.
Google Map | తిరుపతికి వెళ్తుండగా..
మహారాష్ట్రలోని నాగ్పూర్ నుంచి కొంతమంది యువకులు కారులో తిరుపతికి బయలు దేరారు. వారు గూగుల్ మ్యాప్ ఆధారంగా ప్రయాణం ప్రారంభించారు. ఈ క్రమంలో జనగామ జిల్లా (Jangaon District) వడ్లకొండలో వీరి కారు వాగులో పడిపోయింది. అక్కడ వంతెన నిర్మాణం జరుగుతోంది. దీంతో పక్కనుంచి తాత్కాలిక రోడ్డు వేశారు. అయితే గూగుల్ మ్యాప్లో స్ట్రెయిట్గా చూపించింది. దీనికి తోడు అక్కడ ఎలాంటి హెచ్చరిక బోర్డులు కూడా లేవు. దీంతో వేగంగా వెళ్తున్న కారు వాగులో పడిపోయింది. ఆ సమయంలో కారు ఐదుగురు యువకులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారిని రక్షించారు. అనంతరం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.