HomeతెలంగాణHarish Rao | 650 పేజీల నివేదికపై అరగంటలో మాట్లాడమంటే ఎలా.. హరీశ్​రావు ఆగ్రహం

Harish Rao | 650 పేజీల నివేదికపై అరగంటలో మాట్లాడమంటే ఎలా.. హరీశ్​రావు ఆగ్రహం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao | కాళేశ్వరం కమిషన్​ (Kaleshwaram Commission) విచారణ సక్రమంగా జరగలేదని మాజీ మంత్రి హరీశ్​రావు అన్నారు. ఆదివారం ఆయన అసెంబ్లీలో పీసీ ఘోష్ (PC Gosh)​ కమిషన్​ నివేదికపై చర్చలో మాట్లాడారు.

మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డి చర్చను ప్రారంభించారు. స్పీకర్​ హరీశ్​రావుకు అరగంట సమయం ఇచ్చారు. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 650 పేజీల నివేదికపై అరగంటలో సమాధానం చెప్పమంటే ఎలా అని ప్రశ్నించారు. రెండు గంటల సమయం ఇవ్వాలని కోరారు. ఆయన విజ్ఞప్తి కాంగ్రెస్​ అభ్యంతరం చెప్పింది. అనంతరం ఆయన చర్చలో పాల్గొన్నారు. కాళేశ్వరం నివేదికపై నాలుగు రోజులైనా చర్చకు సిద్ధమని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరంపై నిజాలు ప్రజలకు తెలియాలన్నారు.

Harish Rao | నోటీసులు ఇవ్వలేదు

కాళేశ్వరం కమిషన్​ కేసీఆర్‌కు, తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని హరీశ్​రావు అన్నారు. ఘోష్‌ కమిషన్‌ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడిందని ఆరోపించారు. కమిషన్లను పొలిటికల్‌ వెపన్‌గా వాడుకోవద్దని కోర్టులు గతంలోనే చెప్పాయన్నారు. కాళేశ్వరం కమిషన్​ నిబంధనలు అనుసరించలేదనే కోర్టకు వెళ్లామన్నారు. నివేదికను అసెంబ్లీ పెట్టొద్దని హరీశ్​రావు హైకోర్టులో (High Court) హౌస్​ మోషన్​ పిటిషన్​ వేసిన విషయం తెలిసిందే.

Harish Rao | చిత్తు కాగితంతో సమానం

కాళేశ్వరం నివేదికపై ప్రభుత్వం ఆదివారం చర్చ పెట్టడం వెనుక కుట్ర ఉందని హరీశ్​ రావు విమర్శించారు. కోర్టులో వాదనలు ఉన్నాయనే ఆదివారం చర్చ పెట్టారని ఆరోపించారు. పారదర్శకంగా విచారణ జరగకపోతే కమిషన్​ నివేదికలు చిత్తు కాగితంతో సమానమాని గతంలో కోర్టులు చెప్పాయన్నారు. నాడు షా కమిషన్‌ ఇందిరాగాంధీకి (Indira Gandhi) 8బీ కింద నోటీసులు ఇచ్చిందని హరీశ్​రావు గుర్తు చేశారు. అయినా ఆమె కోర్టుకు వెళ్తే కమిషన్‌ను కొట్టివేసిందన్నారు.

ఎల్​కే అద్వానీ (LK Advani)పై గతంలో కమిషన్​ వేస్తే బీజేపీ ధర్నాలు చేసిందన్నారు. ప్రోసీజర్‌ అనుసరించలేదని అప్పుడు లిబ్రహాన్‌ కమిషన్‌ను కోర్టు కొట్టేసిందన్నారు. ప్రస్తుతం పీసీ ఘోష్​ కమిషన్​ కూడా నిబంధనలు పాటించకపోవడంతోనే తాము కోర్టుకు వెళ్లామన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత తాను మహారాష్ట్ర వెళ్లానని హరీశ్​రావు చెప్పారు. తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదన్నారు. దీంతోనే మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించామన్నారు.