Bangladesh | బంగ్లాదేశ్‌లో దారుణం.. మరో హిందువు హత్య

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Bangladesh | బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు ఆగడం లేదు. గత కొద్ది రోజులుగా దుండగులు హిందువులను హతమార్చస్తున్నారు. తాజాగా మరో హిందూ వ్యాపారిని హత్య చేశారు. మణి చక్రవర్తి అనే ఓ కిరాణా దుకాణ వ్యాపారిపై దుండగులు పదునైన ఆయుధాలతో దాడి చేసి హతమార్చినట్లు సమాచారం. రాణాప్రతాప్‌ బైరాగి అనే జర్నలిస్టు (Journalist) హత్య జరిగిన కొన్ని గంటల్లోనే మరో ఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. Bangladesh | అత్యంత రద్దీగా ఉండే […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Bangladesh | బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు ఆగడం లేదు. గత కొద్ది రోజులుగా దుండగులు హిందువులను హతమార్చస్తున్నారు. తాజాగా మరో హిందూ వ్యాపారిని హత్య చేశారు. మణి చక్రవర్తి అనే ఓ కిరాణా దుకాణ వ్యాపారిపై దుండగులు పదునైన ఆయుధాలతో దాడి చేసి హతమార్చినట్లు సమాచారం. రాణాప్రతాప్‌ బైరాగి అనే జర్నలిస్టు (Journalist) హత్య జరిగిన కొన్ని గంటల్లోనే మరో ఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

Bangladesh | అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో..

బంగ్లాదేశ్​లోని నర్సింగ్డి జిల్లా (Narsingdi District)లో అత్యంత రద్దీగా ఉండే చార్‌సిందూర్‌ బజార్‌ (Charsindur Bazaar). ఇంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ హత్య జరగడం గమనార్హం. మణి చక్రవర్తి స్థానిక మార్కెట్‌లో ఓ కిరాణా దుకాణాన్ని నడుపుతున్నట్లు సమాచారం. కాగా.. సోమవారం రాత్రి షాపు ఉండగా.. దుండగులు షాపులోకి చొరబడి పదునైన ఆయుధాలతో అతనిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో క్షతగాత్రుడిని స్థానికులు వెంటనే స్పందించి ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే మణి ప్రాణాలు కోల్పోయాడు.

Bangladesh | బాధ్యులను శిక్షించాలని డిమాండ్​

మణి చక్రవర్తి మంచి వ్యాపారి అని, అతనికి ఎవరితోనూ చిన్నచిన్న విభేదాలు కూడా లేవని తోటి వ్యాపారులు చెబుతున్నారు. కాగా.. బంగ్లాలో తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. బాధ్యులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Bangladesh | 20 రోజుల్లో ఆరుగురి హత్య

బంగ్లాదేశ్​లో విద్యార్థి నాయకుడు ఉస్మాన్‌ హాదీ హత్య గురవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. కాగా.. అప్పటి నుంచి అక్కడ హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. ఫ్యాక్టరీ కార్మికుడు దీపు చంద్రదాస్​ అనే ఫ్యాక్టరీ కార్మికుడి నడిరోడ్డు చెట్టుకు వేలాడదీసి తగలబెట్టిన ఘటనం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇలా గత 18 రోజుల్లో ఆరుగురు హిందువులు హత్యకు గురవడం ఆందోళన కలిగిస్తోంది.

Related articles

The Wedding of VIROSH : పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించిన విజయ్-రష్మిక.. ఎప్పుడంటే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: The Wedding of VIROSH | టాలివుడ్​ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక ఎట్టకేలకు తమ వివాహ బంధం వేడుకను ప్రకటించారు....

Flag march | బాన్సువాడలో ఫ్లాగ్​ మార్చ్​.. 19 మంది నిందితుల అరెస్టు

అక్షరటుడే, బాన్సువాడ: Flag march | కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను జిల్లా పోలీస్...

Hydraa Commissioner Ranganath | రూ.70 వేల కోట్లకు పైగా విలువైన 1,350 ఎకరాల స్థలాలను రక్షించాం : హైడ్రా కమిషనర్​ రంగనాథ్​

అక్షరటుడే, హైదరాబాద్​: Hydraa Commissioner Ranganath | గ్రేటర్​ హైదరాబాద్​లో ఇప్పటివరకు దాదాపు 1,350 ఎకరాల స్థలాలను కబ్జాదారుల కోరల నుంచి కాపాడినట్లు హైడ్రా కమిషనర్...

Hitler police station | పోలీస్​ ఠాణాగా హిట్లర్​ హోం.. రూ. 247 కోట్లతో రెనోవేషన్​!

ఆస్ట్రియా దేశ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన  జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ పుట్టిన ఇంటిని పోలీస్ ఠాణాగా మార్చాలని నిర్ణయించింది.