Bodhan Market Committee
Bodhan Market Committee | మార్కెట్​ కమిటీ వైస్​ ఛైర్మన్​కు సన్మానం

అక్షరటుడే, బోధన్​: Bodhan Market Committee | బోధన్​ మార్కెట్​ కమిటీ వైస్​ ఛైర్మన్​గా ఏరాజ్​పల్లికి చెందిన వసంత్​రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా స్థానిక నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా మార్కెట్​ కమిటీ కృషి చేస్తుందన్నారు. ఆయనను సన్మానించిన వారిలో డీసీసీ అధికార ప్రతినిధి గంగాశంకర్​, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ శీల శంకర్ తదితరులున్నారు.