ePaper
More
    HomeతెలంగాణHyderabad | నవ వరుడి ప్రాణం తీసిన హనీమూన్​ ట్రిప్​.. ట్రైన్​ చైన్​ లాగడం అంత...

    Hyderabad | నవ వరుడి ప్రాణం తీసిన హనీమూన్​ ట్రిప్​.. ట్రైన్​ చైన్​ లాగడం అంత పెద్ద నేరమా..?

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Hyderabad | మృత్యువు ఎప్పుడు ఎలా అటాక్​ చేస్తుందో ఎవరికీ తెలియదు. రాత్రి నిద్రపోయిన వ్యక్తి, మరుసటి రోజు ఉదయం లేస్తారో లేదో కూడా నమ్మకం లేని దుస్థతి. కొత్తగా పెళ్లైన ఓ జంట రైలులో హనుమూన్ ​కు వెళ్తుండగా.. రైలు(Train)​ ఆలస్యం వరుడి ప్రాణాలు తీసింది. ఫలితంగా గమ్యం చేరకుండానే వారి ప్రయాణం విషాదాంతంగా మారింది. ఈ విషాద ఘటన సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్(Secunderabad Railway Station)​లో చోటుచేసుకుంది.

    సికింద్రాబాద్​ జీఆర్​పీ పోలీసుల(GRP police) కథనం ప్రకారం, తెలంగాణలోని వరంగల్​ కు చెందిన రమేశ్​ కుమారుడు ఉరగొండ సాయి(28) స్థానికంగా గిఫ్ట్ ఆర్టికల్స్​ తయారీ సంస్థలో పని చేస్తున్నాడు. ఇతడికి 3 నెలల క్రితం పెళ్లి జరిగింది. ఈ నేపథ్యంలో హనీమూన్​ ప్లాన్​ చేసుకొని గోవా(Goa) వెళ్లాలని కొత్త జంట నిర్ణయించుకుంది. ఈ మేరకు రైలు టికెట్లు రిజర్వేషన్(Tickets reservation)​ చేసుకున్నారు.

    భార్య, బావమరిది, నలుగురు స్నేహితులతో కలిసి గోవా వెళ్లడానికి శుక్రవారం ఉదయం సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​కు చేరుకున్నారు. వీరు వెళ్లాల్సిన రైలు రైల్వేస్టేషన్​లో తొమ్మిదో నంబరు ప్లాట్​ఫాంపై ఆగి ఉంది. అందరూ వాస్కోడిగామా ఎక్స్​ప్రెస్​(Vasco da Gama Express) ఎక్కి తమ సీట్లలో కూర్చున్నారు. రైలు బయలుదేరడానికి ఆలస్యం అయింది. దీంతో ప్లాట్​ఫాంపై ఉన్న స్టాల్​లో వాటర్​ బాటిల్​ కొనేందుకు సాయి కిందికి దిగాడు.

    వాటర్​ బాటిల్​ కొంటుండగా, అంతలోనే రైలు కదిలింది. దీంతో బోగీలో ఉన్న సాయి స్నేహితులు చైన్​ లాగడంతో ట్రైన్​ ఆగింది. ఆర్పీఎఫ్​ పోలీసులు(RPF police) బోగీలోకి చేరుకుని ఏం జరిగిందని ప్రశ్నించారు. వారు జరిగిన విషయం చెప్పడంతో వారిని పోలీసులు ప్లాట్​ఫాంపైకి తీసుకొచ్చారు. అప్పటికే రైలు ఎక్కిన సాయి విషయం తెలుసుకొని మళ్లీ కిందికి దిగి ప్లాట్​ఫాం మీదకు చేరుకున్నాడు. పోలీసులకు ఫైన్​ కడతామని, రైలు వెళ్లిపోతుందని వదిలిపెట్టమని ప్రాధేయపడ్డాడు. ఇంతలోనే రైలు బయలుదేరింది.

    రైలులో సాయి భార్య, బావమరిది, మరో ఇద్దరు స్నేహితులు ఉండిపోయారు. దీంతో సాయి వేగంగా పరిగెత్తి రైలు ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే కాలు జారి రైలు, ప్లాట్​ఫామ్ మధ్యలో పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని పోలీసులు మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

    కాగా, ఈ ఘటనలో యువకులు రైలు చైన్​ లాగి తప్పు చేశారు. నిజమే, అయితే పోలీసులు(Police) మరీ సీన్​ చేసి యువకులను కిందికి దింపి వారిని భయపెట్టారనేది బాధితుల ఆరోపణ. తమని వదిలి పెట్టమని, ఫైన్​ కడతామని ఎంత ప్రాధేయపడినా వినలేదని వాపోతున్నారు. తమ కళ్లెదుటే స్నేహితుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 6 ఆగస్టు​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Kartavya Bhavan | కేంద్ర పరిపాలనా మౌలిక సదుపాయాల ఆధునికీకరణ.. నేడు కర్తవ్య భవన్​ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ..

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Kartavya Bhavan : సెంట్రల్ విస్టా (Central Vista) కింద మొదటి కామన్ సెక్రటేరియట్ (first...

    Indian Army | కాల్పుల ఉల్లంఘన జరగలేదు : ఇండియన్​ ఆర్మీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Indian Army : పాకిస్తాన్ (Pakistan) కాల్పుల విరమణ ఉల్లంఘనను మంగళవారం భారత సైన్యం ఖండించింది....

    Komatireddy | సినీ కార్మికుల సమ్మె.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, హైదరాబాద్: Komatireddy : టాలీవుడ్​(Tollywood)లో సినీ పరిశ్రమ కార్మికులు (Cinema industry workers) సమ్మె బాట పట్టారు....

    More like this

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 6 ఆగస్టు​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Kartavya Bhavan | కేంద్ర పరిపాలనా మౌలిక సదుపాయాల ఆధునికీకరణ.. నేడు కర్తవ్య భవన్​ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ..

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Kartavya Bhavan : సెంట్రల్ విస్టా (Central Vista) కింద మొదటి కామన్ సెక్రటేరియట్ (first...

    Indian Army | కాల్పుల ఉల్లంఘన జరగలేదు : ఇండియన్​ ఆర్మీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Indian Army : పాకిస్తాన్ (Pakistan) కాల్పుల విరమణ ఉల్లంఘనను మంగళవారం భారత సైన్యం ఖండించింది....