Homeజిల్లాలునిజామాబాద్​Telangana University | హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలి: ఎన్​ఎస్​యూఐ, పీడీఎస్​యూ డిమాండ్​

Telangana University | హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలి: ఎన్​ఎస్​యూఐ, పీడీఎస్​యూ డిమాండ్​

హైకోర్టు తీర్పును అమలు చేయాలని ఎన్​ఎస్​యూఐ, పీడీఎస్​యూ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు వర్సిటీలో నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | హైకోర్టు తీర్పును అమలు చేయాలని ఎన్​ఎస్​యూఐ, పీడీఎస్​యూ సంఘాలు (NSUI and PDSU unions) డిమాండ్ చేశాయి. ఈ మేరకు వర్సిటీలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎన్​ఎస్​యూఐ తెలంగాణ యూనివర్సిటీ (NSUI Telangana University) మాజీ అధ్యక్షుడు కొమిర శ్రీశైలం, పీడీఎస్​యూ నాయకులు అనిల్​కుమార్​ మాట్లాడుతూ యూనివర్సిటీలో నియామకాలు చట్టవిరుద్ధంగా జరిగాయని హైకోర్టు తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. వారి తొలగించాలని తీర్పు వెల్లడించిందన్నారు. ఆ తీర్పును అమలు చేయకుండా యూనివర్సిటీ అధికారులు నిర్లక్ష్యం వహించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Telangana University | తప్పుడు పత్రాలతో చలామణి అవుతూ..

అంతేకాకుండా దాదాపు 13 ఏళ్లుగా తప్పుడు సర్టిఫికెట్లతో (false certificates) చలామణి అవుతున్న ప్రొఫెసర్లు, ఉద్యోగుల వేతనాలు తిరిగి రాబట్టేలా చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్​ చేశారు. హైకోర్టు తీర్పును (High Court verdict) అమలు చేయాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో ఎన్​ఎస్​యూఐ, పీడీఎస్​యూ నాయకులు రాజు, గోవింద్, మహేష్, అరుణ, పవిత్ర, సంధ్య, నవీన్ కుమార్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News