HomeUncategorizedGroup 1 Exams | గ్రూప్ -1 పరీక్షలపై హైకోర్టులో విచారణ

Group 1 Exams | గ్రూప్ -1 పరీక్షలపై హైకోర్టులో విచారణ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Group 1 Exams | గ్రూప్​–1 పరీక్షలపై గతంలో సింగిల్​ బెంచ్ ఇచ్చిన తీర్పుపై టీజీపీఎస్సీ(TGPSC) దాఖలు చేసిన పిటిషన్​పై బుధవారం హైకోర్టు(High Court)లో విచారణ జరిగింది. గ్రూప్ -1 మెయిన్స్ మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని అభ్యర్థులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన సింగిల్​ బెంచ్(Single bench)​ ధర్మాసనం ఈ నెల 17న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ పూర్తయ్యే వరకు నియామకపత్రాలు ఇవ్వొద్దని ఆదేశించింది. అయితే సింగిల్​ బెంచ్ ఉత్తర్వులను రద్దు చేయాలని టీజీపీఎస్సీ డివిజన్​ బెంచ్​ను ఆశ్రయించింది.

వాదనలు విన్న న్యాయమూర్తులు(Judges) సింగిల్​ బెంచ్​ ఉత్తర్వులను రద్దు చేయడానికి నిరాకరించారు. సింగిల్​ బెంచ్​లోనే తేల్చుకోవాలని సూచించింది. వేసవి సెలవులకు ముందే తుది తీర్పు ఇవ్వాలని సింగిల్​ బెంచ్​కు న్యాయస్థానం సూచించింది. మరోవైపు ఈ రోజే గ్రూప్​–1(Group-1) పిటిషన్​లపై సింగిల్​బెంచ్​లో సైతం విచారణ జరగనుంది.