ePaper
More
    HomeజాతీయంOperation Sleeper Cells | హై అలర్ట్.. ఆపరేషన్​ స్లీపర్​ సెల్స్.. ఎన్​ఐఏ నిఘా!

    Operation Sleeper Cells | హై అలర్ట్.. ఆపరేషన్​ స్లీపర్​ సెల్స్.. ఎన్​ఐఏ నిఘా!

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Operation Sleeper Cells : జమ్మూకశ్మీర్‌(Jammu Kashmir)లోని పహల్​గామ్​​ ఉగ్రదాడి(Pahalgaon terror attack)కి ప్రతీకారంగా భారత్​ ఆపరేషన్​ సిందూర్​ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే మరోవైపు దేశంలో ఉంటూ పాక్​ కోసం స్లీపర్ సెల్స్‌గా పనిచేస్తున్న వారి వేట కొనసాగుతోంది. పహల్​గామ్​​ దాడిలో లష్కర్-ఎ-తోయిబాతో సంబంధం ఉన్న ఆరుగురు స్లీపర్ సెల్స్ సభ్యులు ఇన్వాల్వ్ కావడమే ఇందుకు కారణం. స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(State Investigation Agency) 20 ప్రదేశాలలో దాడులు చేసి, ఇప్పటికే 15 మంది అనుమానితులను అరెస్టు చేసింది.

    అటు పంజాబ్‌(Punjab)లోనూ ఇటీవల ప్రమాదకర ఆయుధాలు బయటపడ్డాయి. మే 6న హ్యాండ్ గ్రెనేడ్‌లు, రాకెట్ గ్రెనేడ్‌లు, ఒక నగరాన్ని నాశనం చేయగల సామగ్రి వెలుగుచూసింది. ఇది ISI పని అనేది భద్రతా బలగాల అనుమానం. ముంబయి విమానాశ్రయం(Mumbai airport)లో శనివారం ఇద్దరు ISIS ఉగ్రవాదులు అబ్దుల్లా ఫైయాజ్ షేక్, తల్హా ఖాన్ లను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(National Investigation Agency) అరెస్టు చేసింది. విచారణలో బాంబులతో నగరాన్ని నాశనం చేయాలని కుట్ర పన్నినట్లు తెలిసింది. ఇంకా ఎంతమంది స్లీపర్ సెల్స్ ఉన్నారన్నదానిపై దర్యాప్తు కొనసాగుతోంది.

    ముంబయిలో పట్టుబడ్డ నిందితులిద్దరూ పుణెలో ఇంప్రూవ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైసెస్ తయారీ కేసు(2023)లో మోస్ట్ వాంటెడ్‌ లిస్ట్‌లో ఉన్నారు. ఈ కేసు వల్ల ఇద్దరూ రెండేళ్లుగా పరారీలో ఉన్నారు. NIA నుంచి తప్పించుకోవడానికి అబ్దుల్లా ఫైయాజ్ షేక్, తల్హా ఖాన్ ఇండోనేషియాలోని జకార్తాకు పారిపోయారు. వారిపై ముంబయి NIA స్పెషల్ కోర్టు(Mumbai NIA Special Court) నాన్-బెయిలబుల్ వారెంట్‌లు ఇష్యూ చేసింది. ఒక్కొక్కరిపై రూ. 3 లక్షల రివార్డు సైతం ప్రకటించింది. ఇన్నాళ్లూ జకార్తాలో నక్కిన ఇద్దరు కూడా ముంబయిలో ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగించాలన్న పక్కా ప్లాన్‌తో ఇండియాకు తిరిగి వచ్చారు. కానీ, వీళ్లిద్దర్నీ ఎన్‌ఐఏ వలపన్ని పట్టుకుంది.

    హైదరాబాద్‌లోనూ స్లీపర్ సెల్స్ జాడలు లేకపోలేదు. స్థానిక స్లీపర్ సెల్స్ దాడులకు సిద్ధమవుతున్నారని మే 8న ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ఈ ఏడాది జనవరిలో వరంగల్‌(Warangal)లో పాకిస్తానీ ఉగ్రవాది మహ్మద్ జక్రియా అనే స్లీపర్ సెల్ పట్టుబడ్డాడు.

    గుజరాత్‌లోనూ ప్రమాద హెచ్చరికలు ఇష్యూ అయ్యాయి. ఓడరేవులు, రైల్వే స్టేషన్‌లు, జనసమూహాలను లక్ష్యంగా స్లీపర్ సెల్స్ దాడి చేయొచ్చని ఇంటెలిజెన్స్ నివేదించింది. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు నిరంతరం నిఘా పెడుతున్నాయి.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...