అక్షరటుడే, వెబ్డెస్క్ : Terror Attack | జమ్మూ కశ్మీర్ jammu kashmirలో హై అలర్ట్ కొనసాగుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి pahalgam terror attack తర్వాత మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో భద్రతా బలగాలు security forces అప్రమత్తం అయ్యాయి. ముఖ్యంగా కశ్మీర్లోని జైళ్లపై ఉగ్రదాడులు జరిగే అవకాశముందని నిఘావర్గాలు హెచ్చరించాయి. పలు జైళ్లలో ఉగ్రవాదులు ఉండటంతో వారికోసం దాడులు జరిగే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో అధికారులు జైళ్ల వద్ద భద్రతను పెంచారు. జమ్మూ కశ్మీర్లోని జైళ్ల భద్రతను సీఐఎస్ఎఫ్ చూస్తుంది.
Terror Attack | కొనసాగుతున్న దర్యాప్తు
పహల్గామ్ ఉగ్రదాడిపై ఎన్ఐఏ nia విచారణ కొనసాగుతోంది. జైలులో ఉన్న ఉగ్రవాదులు నిసార్, ముష్తాక్ను అధికారులు విచారించారు. ఆర్మీ వాహనంపై దాడికేసులో నిసార్, ముష్తాక్ అరెస్ట్ అయి జైలులో ఉన్నారు. వీరిని అధికారులు విచారించి కీలక సమచారం సేకరించారు.
Terror Attack | ముమ్మురంగా గాలింపు
పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన వారు దక్షిణ కశ్మీర్ అడవుల్లోనే forest ఉన్నట్లు భద్రత బలగాలు అనుమానిస్తున్నాయి. దీంతో ఆ అడవుల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన ప్రాంతం నుంచి 20 కిలో మీటర్ల మేర సెర్చ్ ఆపరేషన్ search operation పూర్తి చేశాయి. డ్రోన్లు, హెలికాప్టర్ల సాయంతో భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తున్నాయి. మరోవైపు జమ్మూ కశ్మీర్లోని పూంచ్ జిల్లాలో భద్రత బలగాలు ఉగ్రవాద స్థావరాన్ని గుర్తించాయి. కమ్యూనికేషన్ పరికరాలు, ఐదు ఐఈడీలను స్వాధీనం చేసుకున్నాయి.