అక్షరటుడే, ఇందూరు: నగరంలో గురువారం భారీ వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షం కారణంగా నగరంలోని పులాంగ్ చౌరస్తా సమీపంలో ఓ భారీ చెట్టు సాయంత్రం సమయంలో నేలకొరిగింది. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వెంటనే ట్రాఫిక్ సీఐ ప్రసాద్, ఏఎస్సై శ్రీనివాస్రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ కేశవ్, సిబ్బంది ప్రసాద్, రమేశ్, ఉదయ్ తదితరులు ఘటనా స్థలానికి చేరుకుని వాహనాలను మళ్లించారు. అనంతరం జేసీబీ సహాయంతో చెట్టును తొలగింపజేశారు.

