అక్షరటుడే, వెబ్డెస్క్:Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Meteorological Department) అధికారులు తెలిపారు. గత 10 రోజులుగా రాష్ట్రంలో ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నేటి నుంచి ఉష్ణోగ్రతలు తగ్గి ఉక్కపోత నుంచి ఉపశమనం లభించనుంది. ఉదయం నుంచే వాతావారణం మేఘావృతమై ఉంటుంది.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు మోస్తరు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్(Hyderabad) నగరంలో ఉదయం 11 గంటల ప్రాంతంలో మోస్తరు వర్షాలు పడుతాయని తెలిపారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.
Weather Updates | గాలివాన బీభత్సం
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలుల దాటికి అనేక ప్రాంతాల్లో చెట్లు విరిగి పడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో గాలివానతో ప్రజలు అతలాకుతలం అయ్యారు. విద్యుత్ స్తంభాలు(Electricity poles) విరిగిపడటంతో పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. మంగళవారం ఉదయం వరకు కూడా కరెంట్ రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
Weather Updates | వర్షపాతం వివరాలు..
గడిచిన 24 గంటల్లో పలు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదు అయింది. నిర్మల్ జిల్లా కుబీర్లో అత్యధికంగా 72 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లా సోమూరులో 70.5, నిర్మల్ జిల్లా నర్సాపూర్లో 68.5, ఆదిలాబాద్ పట్టణంలో 67.3, ఇచ్చోడలో 60.0, ఆర్మూర్ మండలం మగ్గిడిలో 45 వర్షపాతం నమోదు అయింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం పడింది.