అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | డ్రంకన్ డ్రైవ్లో (Drunk and Drive) పట్టుబడిన పలువురికి న్యాయస్థానం భారీగా జరిమానాలు విధించింది. ఇందుకు సంబంధించిన వివరాలను ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్అలీ (Traffic ACP Mastan Ali) వెల్లడించారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ ఆధ్వర్యంలో నగరంలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేస్తుండగా..పలువురు మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు.
Nizamabad City | ముగ్గురికి వారంరోజుల పాటు జైలు..
ఈ సందర్భంగా వారికి కౌన్సెలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ (Second Class Magistrate) ఎదుట హాజరపర్చారు. ఈ సందర్భంగా 43 మందికి రూ.10వేల చొప్పున రూ. 4,30,000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిందని ఏసీపీ తెలిపారు. అలాగే మరో ముగ్గురు వ్యక్తులకు వారంరోజుల చొప్పున జైలుశిక్ష విధించినట్లు ఆయన చెప్పారు.