Homeతాజావార్తలుMLA Defection | ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ వాయిదా

MLA Defection | ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ వాయిదా

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణను వాయిదా వేసినట్లు స్పీకర్​ కార్యాలయం తెలిపింది. ఇవాళ, రేపు జరగాల్సిన విచారణను 14, 15 తేదీల్లో చేపడుతామని పేర్కొంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : MLA Defection | ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణను స్పీకర్​ కార్యాలయం వాయిదా వేసింది. బీఆర్​ఎస్​ నుంచి కాంగ్రెస్​ (Congress)లో చేరిన పది మందిపై అనర్హత వేటు వేయాలని బీఆర్​ఎస్​ నాయకులు (BRS Leaders) ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు తీర్పు మేరకు స్పీకర్ విచారణ చేపడుతున్నారు.

అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని జులై 31న సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పు చెప్పింది. ఈ క్రమంలో స్పీకర్ గతంలో నలుగురు ఎమ్మెల్యే (MLA)లను విచారించారు. ఈ నెల 6, 7 తేదీల్లో రెండో విడతలతో మరో నలుగురిని విచారించారు. వారిని మళ్లీ ఈ నెల 12, 13 తేదీల్లో విచారించాల్సి ఉంది. అయితే ఇవాళ, రేపు జరగాల్సిన విచారణను వాయిదా వేసినట్లు స్పీకర్​ కార్యాలయం (Speaker Office) తెలిపింది.ఈ నెల 14, 15 తేదీల్లో విచారిస్తామని వెల్లడించింది. నవంబర్ 6న తెల్లం వెంకట్రావ్, సంజయ్​ల పిటిషన్లనుచ 7న పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy), అరికెపూడి గాంధీల పిటిషన్లపై స్పీకర్​ విచారణ చేపట్టారు.

MLA Defection | ముగిసిన గడువు

అనర్హత పిటిషన్లపై స్పీకర్​ ఇచ్చిన గడువు అక్టోబర్​ 31తో ముగిసింది. దీంతో మరికొంత సమయం కావాలని స్పీకర్​ కార్యాలయం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మరోవైపు స్పీకర్​ గడువులోగా నిర్ణయం తీసుకోకపోవడంతో కోర్టు ధిక్కారణకు పాల్పడ్డారని బీఆర్​ఎస్​ (BRS) దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్​ వేసింది. దీనిపై సోమవారం విచారణ చేపడుతామని న్యాయస్థానం తెలిపింది. అప్పటిలోగా స్పీకర్​ నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. దీంతో కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

Must Read
Related News