Nizamabad City | హోంగార్డుల ఆరోగ్యం, ఆర్థిక భద్రత కోసం ఆరోగ్య బీమా: అదనపు డీసీపీ

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | చిన్నచిన్న అనారోగ్య సమస్యలు కూడా భారంగా మారకుండా హోంగార్డులకు బీమా అవసరమని అదనపు డీసీపీ రామచంద్రరావు (Additional DCP Ramachandra Rao) అన్నారు. సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా పోలీస్​ పరేడ్ గ్రౌండ్​లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో అదనపు డీసీపీ హోంగార్డుల ఆరోగ్య బీమాపై అవగాహన కల్పించారు. యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ హెల్త్ ఇన్సూరెన్స్ పథకాల (health insurance policies) గురించి, […]

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | చిన్నచిన్న అనారోగ్య సమస్యలు కూడా భారంగా మారకుండా హోంగార్డులకు బీమా అవసరమని అదనపు డీసీపీ రామచంద్రరావు (Additional DCP Ramachandra Rao) అన్నారు. సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా పోలీస్​ పరేడ్ గ్రౌండ్​లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో అదనపు డీసీపీ హోంగార్డుల ఆరోగ్య బీమాపై అవగాహన కల్పించారు.

యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ హెల్త్ ఇన్సూరెన్స్ పథకాల (health insurance policies) గురించి, పోలీసు కుటుంబాల ఆరోగ్య భద్రతను బలోపేతం చేసే మార్గాలపై  ప్రతిపాదనలు చేశారు. అనంతరం అదనపు డీసీపీ(ఏఆర్​) మాట్లాడుతూ పోలీసు వ్యవస్థలో అత్యంత ముఖ్య భూమిక పోషించే హోంగార్డులు ఆరోగ్యంగా, ఆర్థికంగా భద్రంగా ఉండాలని సూచించారు.

సేవలో నిమగ్నమయ్యే సమయంలో ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా, ఆరోగ్య బీమా మీకు రక్షణ కవచంలా నిలుస్తుందని చెప్పారు. చిన్నసమస్యలు పెద్దభారం కాకుండా ముందుగానే బీమా తీసుకోవడం ద్వారా కుటుంబాల భవిష్యత్తు పదిలమవుతుందన్నారు.

అందరికీ పూర్తి అవగాహనతో, నిర్భయంగా ఆరోగ్య బీమా తీసుకొని భద్రతను పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్​స్పెక్టర్​ హెచ్ సతీష్ (హోంగార్డ్స్), శేఖర్ బాబు (ఎంటీవో), కె.శ్రీనివాస్ (అడ్మిన్), తిరుపతి (వెల్ఫేర్), కార్పొరేట్ శాలరీ మేనేజర్ సి. వెంకటేష్, బ్యాంక్ అధికారులు, హోంగార్డులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related articles

Lakshman Rathod Award | లక్ష్మణ్ రాథోడ్​కు ఇండియన్ బెస్ట్ ఇన్​స్పిరేషన్​ అవార్డు

విద్యార్థులకు, క్రీడాకారులకు ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ.. వారి ఉన్నతికి విశేష కృషి చేస్తున్న జడ్పీహెచ్​ఎస్​ పేట్​సంగం పీఈటీ, బామన్​ నాయక్​ స్పోర్ట్స్​ ఫౌండేషన్​ వ్యవస్థాపకుడు లక్ష్మణ్​రాథోడ్​కు ఇండియన్​ బెస్ట్​ ఇన్​స్పిరేషన్ అవార్డు వరించింది.

KTR BRS Statement | బీఆర్​ఎస్​ అధికారంలోకి రాగానే కాంగ్రెస్​ అరాచకాలను బయటపెడతాం: కేటీఆర్​

బీఆర్​ఎస్​ అధికారంలోకి రాగానే కాంగ్రెస్​ అరాచకాలను ఒక్కొక్కటిగా బయటపెడతామని కేటీఆర్​ అన్నారు. హైదరాబాద్​ నుంచి ఆదిలాబాద్​ వెళ్తూ ఆర్మూర్​లో ఆగారు.

Arvind Ukraine Group | ఉక్రెయిన్ పార్లమెంటరీ ఫ్రెండ్​షిప్ గ్రూప్ టీం లీడర్​గా ఎంపీ అర్వింద్

ఉక్రెయిన్ పార్లమెంటరీ ఫ్రెండ్​షిప్ గ్రూప్ టీం లీడర్​గా ఎంపీ అర్వింద్ నియమితులయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం ఈ బృందం లక్ష్యం.

Tirumala Laddu Adulteration Issue | తిరుమల లడ్డూ కల్తీపై అసెంబ్లీలో చర్చ.. కుట్ర ఉందన్న సీఎం

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. 2019-24 మధ్య దేవాలయాల్లో అరాచకాలు జరిగాయని సీఎం చంద్రబాబు అన్నారు.