- Advertisement -
Homeజిల్లాలుజగిత్యాలJagityala | భార్యా పిల్లలను వదిలేశాడు.. ట్రాన్స్‌జెండర్​ వెంటపడ్డాడు..

Jagityala | భార్యా పిల్లలను వదిలేశాడు.. ట్రాన్స్‌జెండర్​ వెంటపడ్డాడు..

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Jagityala : అందమైన భార్య.. ముత్యాల్లాంటి చిన్నారులు.. చూడ ముచ్చటైన సంసారం.. అయినా వద్దనుకున్నాడు. ట్రాన్స్‌జెండర్‌ వద్దకు వెళ్లిపోయాడు. అతడితో సహజీవనం చేస్తున్నాడు. సమాజాన్ని విస్తుపర్చుతున్న ఈ ఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో వెలుగుచూసింది.

సారంగాపూర్‌ (Sarangapur Mandal) మండలం పెంబట్ల గ్రామానికి చెందిన యువతితో జగిత్యాల పట్టణానికి చెందిన బింగి రాజశేఖర్​కు 2014లో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, రాజశేఖర్​కు ఇటీవల హైదరాబాద్‌(Hyderabad)కు చెందిన దీపూ అనే ట్రాన్స్‌జెండర్​తో పరిచయం ఏర్పడింది. దీంతో అతడితో సన్నిహిత సంబంధం పెట్టుకున్నాడు. ఇంకేం.. భార్యాపిల్లలను వదిలేసి, దీపూతోనే సహజీవనం చేస్తున్నాడు. దీపూతో హైదరాబాద్‌లోనే ఉండిపోయాడు.

- Advertisement -

Jagityala : భార్య ఆత్మహత్యాయత్నం..

భర్త నిర్వాకం తెలిసిన భార్య తట్టుకోలేకపోయింది. సమాజంలో తలవంపులు తీసుకొచ్చాడని ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించడంతో ప్రస్తుతం చికిత్స పొందుతోంది.

భార్య ఆసుపత్రిలో ఉన్నా.. రాజశేఖర్ ఆమెను చూసేందుకు రాకపోవడంతో అత్తామామలు ఆందోళనకు గురవుతున్నారు. అతగాడి కోసం వెతకడం ఆరంభించారు.

కాగా, ట్రాన్స్‌జెండర్​తో కలిసి రాజశేఖర్​ జగిత్యాలలోనే ఉన్నాడని తెలుసుకున్న కుటుంబ సభ్యులు.. వారిద్దరు గదిలో ఉండటాన్ని గుర్తించి, తలుపులు పెట్టి పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు అక్కడికి చేరుకుని రాజశేఖర్​తో పాటు ట్రాన్స్‌జెండర్​(transgender)ను పోలీస్​ స్టేషన్​కు తరలించారు. ఇద్దరికి కౌన్సెలింగ్​ ఇచ్చారు. తదుపరి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News