HomeజాతీయంIndian Railways | రైలులో వాష్‌రూమ్‌ని బెడ్రూమ్‌గా మార్చేశాడు.. వైరల్​ అవుతున్న వీడియో

Indian Railways | రైలులో వాష్‌రూమ్‌ని బెడ్రూమ్‌గా మార్చేశాడు.. వైరల్​ అవుతున్న వీడియో

రైలులో స్థలం లేకపోవడంతో ఓ వ్యక్తి వాష్​రూమ్​లో తన సామగ్రి పెట్టాడు. అంతేగాకుండా దానిని బెడ్​రూమ్​గా మార్చి అందులోనే ప్రయాణించాడు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Indian Railways | దేశంలో రైళ్లలో రద్దీ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా పండుగల సమయంలో టికెట్లు దొరకడం కష్టం. ఇక జనరల్ బోగీల్లో అయితే కాలు పెట్టడానికి కూడా చోటు ఉండదు. ఇటీవల దీపావళి సందర్భంగా ఓ రైలు నిండిపోయింది.

అయితే తన సామగ్రితో స్టేషన్​కు చేరుకున్న ఓ వ్యక్తి అందులో ఎక్కడానికి స్థలం లేక ఇబ్బంది పడ్డాడు. వెంటనే తన సామనును రైలు (Train)లోని బాత్​రూమ్​లో నింపేవాడు. వాష్​రూమ్​ డోర్​ పెట్టి దానిని బెడ్​రూమ్​ మార్చుకొని ప్రయాణం చేశాడు. తనతో పాటు తెచ్చుకున్న మంచాన్ని బయట కిటికీకి కట్టాడు. ఈ వ్యవహారాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్​ మీడియా (Social Media)లో పోస్ట్​ చేయడంతో వైరల్​ మారింది.

Indian Railways | టాయ్​లెట్​లో..

ఆ వీడియోలో ఓ వ్యక్తి రైలు టాయిలెట్ (Train Toilet) లోపల తన సామగ్రిపై పడుకుని ఉన్నాడు. విశాల్ అనే కంటెంట్ క్రియేటర్ ఈ వీడియోను తీశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఆరు లక్షల వ్యూస్​ దాటింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరేమో ప్రయాణికుడిపై జాలి పడుతుండగా.. మరి కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైలులో స్థలం లేక వాష్​రూమ్​లో ప్రయాణిస్తున్నారని పలువురు కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు రైలులోని వారు వాష్​రూమ్​ వినియోగించకుండా ఇలా ఆక్రమించడం సరికాదని మండి పడుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by VishaL (@mr.vishal_sharma_)