అక్షరటుడే, వెబ్డెస్క్ : Harish Rao Criticizes Revanth | కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్రావు విమర్శలు చేశారు. రెండేళ్ల పాలనలో సీఎం చేసిందేమి లేదని, కూల్చిందే ఎక్కువ ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం మూసీ సుందరీకరణ (Musi Beautification) చేపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బాపూఘాట్ (Bapu Ghat)లో గాంధీజీ విగ్రహం పెట్టాలని నిర్ణయించింది. స్థల సేకరణ కోసం పలువురికి నోటీసులు ఇచ్చింది. దీంతో తమ ఇళ్లు పోతున్నాయని బాధితులు ఆందోళన చెందుతున్నారు. వారితో హరీశ్రావు ఆదివారం హైదర్ షా కోట్లో సమావేశం అయ్యారు. గాంధీజీ అహింసావాదని, అలాంటి అహింసామూర్తి విగ్రహాన్ని పెట్టడానికి రేవంత్ రెడ్డి హింసాత్మక మార్గాన్ని ఎంచుకున్నారని విమర్శించారు.
Harish Rao Criticizes Revanth | మధ్య తరగతి వారి పరిస్థితి ఏంటీ
మధ్యతరగతి కుటుంబానికి ఇల్లు అనేది ఒక కల అని హరీశ్రావు అన్నారు. రెక్కల కష్టంతో పైసా పైసా పోగుచేసుకొని, బ్యాంకుల్లో అప్పులు తెచ్చి మరీ ఇల్లు కొనుక్కుని కల నిజం చేసుకుంటే
రేవంత్రెడ్డి వచ్చి బుల్డోజర్లు పెట్టి ఆ ఇండ్లు కూలుస్తామని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం నీకేంది జూబ్లీహిల్స్ (Jubilee Hills) ప్యాలెస్లో బాగానే ఉన్నారని, ఇంకో 100 కోట్లతో ఇంకో ప్యాలెస్ కూడా కట్టుకుంటారన్నారు. మరి ఈ మధ్య తరగతి ప్రజల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు.
Harish Rao Criticizes Revanth | అండగా ఉంటాం
మూసీ ప్రాజెక్టు (Musi Project)కు ఇప్పటివరకు డీపీఆర్ తయారు కాలేదని హరీశ్రావు పేర్కొన్నారు. ఇప్పటివరకు గరిష్ట వరద స్థాయిని సైతం నిర్ధారించలేదని చెప్పారు. సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలేదని, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకురాలేదని చెప్పారు. ఇవన్ని లేకుండా ఇండ్లు కూల్చేస్తామని నోటీసులు ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. దీనిపై న్యాయపరంగా మూసీ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బాధితుల తరఫున మాట్లాడుతామన్నారు.
బీఆర్ఎస్ (BRS) అధికారంలో ఉన్నప్పుడు మూసీలోకి మురుగు నీరు రాకుండా రూ.3,800 కోట్లతో 38 STPలు నిర్మించామని ఆయన గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి నీళ్లను మూసీలో కలిపేందుకు ప్రణాళికలు తయారు చేసినట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని కొనసాగించకుండా, మూసీ అభివృద్ధి పేరిట ఇండ్లు కూల్చడం దేనికని ప్రశ్నించారు.
