Homeతాజావార్తలుKavitha Janam Bata | హరీశ్​రావు, బీఆర్​ఎస్​పై మరోసారి కవిత తీవ్ర విమర్శలు

Kavitha Janam Bata | హరీశ్​రావు, బీఆర్​ఎస్​పై మరోసారి కవిత తీవ్ర విమర్శలు

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి మాజీ మంత్రి హరీశ్​రావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. జనంబాటలో భాగంగా ఆమె మెదక్​లో మాట్లాడారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kavitha Janam Bata | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) జనంబాట కార్యక్రమంలో భాగంగా మెదక్​ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం ఆమె హవేలి ఘన్​పూర్​ మండల (Ghanpur Mandal) కేంద్రంలో పాడిరైతులతో మాట్లాడారు. అనంతరం మెదక్​లో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్​ఎస్​ పార్టీ, హరీశ్​రావుపై ఆమె విమర్శలు చేశారు.

హరీశ్​ రావు (Harish Rao) కుటుంబం, ప్రైవేట్​గా పాల వ్యాపారాలు చేసి పాల రైతులకు అన్యాయం చేసిందని కవిత ఆరోపించారు. ఎలాంటి టెండర్లు లేకుండానే హాస్టళ్లకు పాలు సప్లై చేసి డబ్బు సంపాదించుకున్నారని విమర్శించారు. మెదక్​ నుంచి హరీశ్​​ రావు మంత్రిగా పనిచేసినా లాభం లేకుండా పోయిందన్నారు. మెదక్​​లో మినీ ట్యాంక్​ బండ్​ (mini tank bund) హామీ గాలికి పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశార. అన్నదాలకు సాగునీరందక ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. రూరల్ ఏరియాల్లో పాడి రైతులకు న్యాయం జరగడం లేదన్నారు. హరీశ్​​ రావు బినామీలే ఈ పాల వ్యాపారం సాగిస్తున్నారని ఆరోపించారు.

Kavitha Janam Bata | అందుకే బీఆర్​ఎస్​ ఓడిపోయింది

ప్రతిపక్షం (BRS) తన పాత్రను సమర్థవంతంగా పోషించి ఉంటే జూబ్లీ హిల్స్ ఎన్నికల (Jubilee Hills elections) ఫలితాలు భిన్నంగా ఉండేవి అని కవిత అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్​పై రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకత ఉందని కవిత పేర్కొన్నారు. అయినా కూడా జూబ్లీహిల్స్​ అన్ని వేల ఓట్ల మెజార్టీతో ఎలా గెలిచిందని ప్రశ్నించారు. బీఆర్​ఎస్​ నాయకులు ప్రతిపక్షంలో సరిగ్గా పనిచేయకపోవడంతోనే కాంగ్రెస్​ గెలిచిందన్నారు. వాళ్లు సోషల్​ మీడియాలో (social media) మాత్రమే ఉద్యమాలు చేస్తున్నారని విమర్శించారు.

Kavitha Janam Bata | ఆర్​ఆర్​ఆర్​ అలైన్​మెంట్ మార్చారు

బీఆర్​ఎస్​ నాయకుల ఫామ్​హౌస్​లు, భూములు (farmhouses and lands) కాపాడుకోవడానికి నర్సాపూర్​ మండలం రెడ్డిపల్లి గ్రామంలో ఆర్​ఆర్​ఆర్​ అలైన్​మెంట్​ మార్చారని ఆరోపించారు. దీంతో రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఈ ఫామ్​హౌస్​ హరీశ్​రావుది అని స్థానికులు అంటున్నారని ఆమె చెప్పారు. హరీశ్​రావు కోసం అలైన్​మెంట్​ మార్చారని ఆరోపించారు. మెదక్ జిల్లాను ఛార్మినార్​ జోన్​లో కలపాలని కవిత డిమాండ్​ చేశారు. ప్రస్తుతం జిల్లా రాజన్న జోన్​లో ఉండటంతో ప్రజలు హైదరాబాద్​లో ఉద్యోగాలకు అప్లై చేసుకోలేకపోతున్నారన్నారు.

Must Read
Related News