ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​MP Arvind | కాళేశ్వరం విచారణ సీబీఐకి అప్పగించడం హర్షణీయం : ఎంపీ అర్వింద్​

    MP Arvind | కాళేశ్వరం విచారణ సీబీఐకి అప్పగించడం హర్షణీయం : ఎంపీ అర్వింద్​

    Published on

    అక్షరటుడే, ధర్పల్లి : MP Arvind | బీఆర్ఎస్ (BRS) హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలతోనే ప్రాజెక్టులు, చెరువులు తెగిపోయి ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఎంపీ ధర్మపురి అర్వింద్​ అన్నారు.

    ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండంలంలోని ముత్యాల చెరువు తెగిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఆయన వాడి, నడిమితండా గ్రామాల్లో పర్యటించారు. వరద బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

    MP Arvind | రూ.వేల కోట్లు దోచుకున్నారు

    కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project)​ పేరుతో కేసీఆర్​ కుటుంబం రూ.వేల కోట్లు దోచుకుందని ఎంపీ ఆరోపించారు. ఈ విషయంలో కాంగ్రెస్​ ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు అలసత్వం వహించిందో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా విచారణను సీబీఐకి అప్పగించడం హర్షణీయం అని పేర్కొన్నారు. ముత్యాల చెరువు తెగిపోయి పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం అందించాలని డిమామడ్​ చేశారు. కార్యక్రమంలో నిజామాబాద్​ జిల్లా అధ్యక్షుడు దినేశ్​, పసుపు బోర్డు ఛైర్మన్​ పల్లె గంగారెడ్డి, జిర్ర మహిపాల్ యాదవ్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

    More like this

    Movements and Protests | రెండు దేశాలు.. రెండు ఉద్యమాలు.. ప్రభుత్వాలను కూల్చేసిన నిరసనలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Movements and Protests | రెండు దేశాల్లో రగిలిన రెండు ఉద్యమాలు అక్కడి ప్రభుత్వాలను...

    Kamareddy | ఊపిరితిత్తులలో ఇరుక్కున్న శనగ గింజ.. చికిత్స చేసి తొలగించిన వైద్యులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని శ్వాస చెస్ట్ అండ్ జనరల్ ఆస్పత్రిలో (Swasah Chest and General...

    Minister Nitin Gadkari | వరద సాయం అందించి కామారెడ్డిని ఆదుకోండి

    అక్షరటుడే, కామారెడ్డి: Minister Nitin Gadkari | భారీ వర్షాలు కామారెడ్డి నియోజకవర్గాన్ని (Kamareddy constituency) అతలాకుతలం చేశాయి....