Homeతాజావార్తలుHyderabad | హైదరాబాద్​లో కాల్పుల కలకలం

Hyderabad | హైదరాబాద్​లో కాల్పుల కలకలం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: హైదరాబాద్​ నగరంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. నగరంలోని చాదర్​ఘాట్​​లో ఇద్దరు సెల్​ఫోన్​ దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు.

ఈ క్రమంలో కానిస్టేబుల్​పై దొంగ కత్తితో దాడికి యత్నించాడు. దీంతో సౌత్ఈస్ట్​ డీసీపీ చైతన్య కుమార్​ తన గన్​మెన్​ నుంచి వెపన్​ తీసుకుని దొంగపై కాల్పులు జరిపారు. దొంగలపై రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఇద్దరు దొంగల్లో ఒకరికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. కాగా.. డీసీపీతో పాటు మిగతా వారు క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా.. ఇటీవల నిజామాబాద్​ నగరంలో ఓ రౌడీషీటర్​ సీసీఎస్​ కానిస్టేబుల్​ ప్రమోద్​పై దాడి చేసి హతమార్చిన విషయం తెలిసిందే. అనంతరం పోలీసులు నిందితుడిని పట్టుకుని ఆస్పత్రికి తరలించగా.. పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో పోలీసులపై మరోసారి దాడి చేసేందుకు యత్నించగా ఆత్మరక్షణలో భాగంగా కాల్పులు జరపడంతో రియాజ్​ మృతి చెందిన విషయం విదితమే.